Divorce : ప్రస్తుత తరుణంలో చాలా మంది సెలబ్రిటీ జంటలు విడాకులు తీసుకుంటున్నాయి. మన దేశంలోనూ ఏటా విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి. భార్యా భర్త విడాకులు తీసుకునేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే ఇద్దరి మధ్యా ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే.. అది విడాకులకు దారి తీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ మేరకు పలువురు సైంటిస్టులు చేపట్టిన వేర్వేరు అధ్యయనాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి.
న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పాలా ఇంగ్లండ్ బృందం 3622 జంటలపై అధ్యయనం చేసింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు బయట పడ్డాయి. విడాకులు కోరుతున్న వారిలో పురుషుల సంఖ్య ఎక్కువగా ఉందని, వారి శాతం 87 గా ఉందని తెలిపారు. కొన్ని జంటల్లో భార్యల వయస్సు భర్తల కన్నా 3 ఏళ్లు ఎక్కువగా ఉంటుందని.. అలాంటి వారిలో భర్తలు ముందుగా విడాకులు కోరుతున్నారని తెలిపారు. భార్య తన కన్నా ఎక్కువ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని, పరిపక్వతతో ఆలోచిస్తుందని భావించే వయస్సు తక్కువ ఉన్న భర్తలు ముందుగా విడాకులు తీసుకుంటున్నారని తెలిపారు.
ఇక భార్యా భర్తల మధ్య ఏజ్ గ్యాప్ 5 అంతకన్నా ఎక్కువగా ఉన్నా మంచిది కాదని.. ఇలాంటి జంటలు కూడా విడాకులు తీసుకునే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని అంటున్నారు. ఈ మేరకు హౌజ్ హోల్డ్, ఇన్కమ్ అండ్ లేబర్ డైనిమక్స్ ఇన్ ఆస్ట్రేలియా అనే అధ్యయనంలో వివరాలను వెల్లడించారు. ఇలాంటి జంటల్లో భర్త వయస్సు ఎక్కువగా ఉంటుందని, అతను చెప్పే విషయాలను వయస్సు తక్కువగా ఉండే భార్య అర్థం చేసుకోలేకపోతుందని.. అందుకనే భర్తలు విడాకులు కోరుతున్నారని వెల్లడైంది.
అయితే భార్య భర్తల వయస్సు సమానంగా ఉంటే వారు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారని.. వారు విడిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయని అంటున్నారు. అలా కాకుండా భార్యా భర్తల్లో ఏ ఒక్కరి వయస్సు ఎక్కువగా ఉన్నా.. వారు విడిపోయే అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇక 23 ఏళ్ల లోపు పెళ్లి చేసుకునే వారు కూడా త్వరగా విడాకులు తీసుకుంటారని వెల్లడించారు. 32 దాటాక కూడా వివాహం చేసుకుంటే విడాకులు తీసుకునే అవకాశాలు పెరుగుతాయని, కనుక 24 నుంచి 30 ఏళ్ల మధ్య వివాహం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని అంటున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…