Fish : అదృష్టం అనేది ఎవరినీ అంత సులభంగా వరించదు. వరిస్తే మాత్రం రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు. అవును.. ఇలాంటి సంఘటనల గురించి గతంలో మనం అనేక సార్లు చదివాం. కోల్కతాలోనూ తాజాగా ఇలాంటిదే ఓ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కోల్కతాలోని తూర్పు మిడ్నపూర్ లో ఉన్న దిఘా అనే ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు మనోరంజన్ ఖండాకు అరుదైన చేపలు లభించాయి. గత శనివారం ఆయన, ఇంకొందరు మత్స్యకారులు కలిసి చేపలకు వెళ్లారు. ఈ క్రమంలోనే వారికి అత్యంత అరుదైన “తేలియా భోలా” చేపలు చిక్కాయి. మొత్తం 121 చేపలు వలలో పడ్డాయి. వాటిని అక్కడి మోహన చేపల మార్కెట్లో విక్రయించాడు. దీంతో అతనికి రూ.2 కోట్లు వచ్చాయి. అలా అతను రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.
తేలియా భోలా చేపలు అత్యంత అరుదైనవి. అవి ఎప్పుడో ఒకసారి గానీ వలలో పడవు. ఈ క్రమంలో మనోరంజన్ను చేపలు అదృష్టం రూపంలో వరించాయి. ఏకంగా 121 చేపలు వలలో పడడంతో అతని పంట పండింది. ఈ చేపల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వీటి లివర్లోని ఆయిల్ నుంచి పలు ఔషధాలను తయారు చేస్తారు. అలాగే ఈ చేపల చర్మానికి సైతం అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. వీటి చర్మం కేజీకి రూ.85వేల మేర ఉంటుంది. అందుకనే ఈ చేపలు అంత ధర పలుకుతుంటాయి. ఏది ఏమైనా.. మనోరంజన్ను మాత్రం ఆ చేపలు అదృష్టంలా వరించాయి. వాటితో అతను రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. కరోనా సమయంలో తమకు చాలా నష్టాలు వచ్చాయని, ఈ దెబ్బతో ఆ నష్టాలన్నింటినీ భర్తీ చేసుకోగలిగానని.. మనోరంజన్ తెలిపాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…