Actress Meena : ప్రముఖ నటి మీనా ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం విదితమే. ఆమె భర్త విద్యాసాగర్ (48) మంగళవారం రాత్రి అకస్మాత్తుగా చనిపోయారు. ఈ క్రమంలో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన శ్వాసకోశ సమస్యలతో మృతి చెందారని వైద్యులు తెలిపారు. అయితే విద్యాసాగర్ మరణానికి సంబంధించి తమిళనాడులోని స్థానిక పత్రికలు రకరకాల కథనాలను ప్రచురిస్తున్నాయి. మీనా ఇంటి వద్ద పావురాలు ఎక్కువగా ఉంటాయట. ఈ క్రమంలోనే వాటి వ్యర్థాల నుంచి వచ్చే గాలిని ఆయన ఎక్కువగా పీల్చారట. అందుకనే ఆయన ఇన్ఫెక్షన్ బారిన పడి చనిపోయారట. అలా అని చెప్పి అక్కడి పత్రికలకు చెందిన వెబ్సైట్లలో కథనాలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
ఇక పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల మీనా భర్త విద్యాసాగర్ ఊపిరితిత్తులు ఇన్పెక్షన్కు గురయ్యాయని తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన ఈ ఏడాది ఆరంభంలో కరోనా బారిన పడ్డారు. అయితే కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తులు బాగా దెబ్బ తిన్నాయి. దీంతో ఆయనకు లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చింది. ఊపిరితిత్తులు మార్చడం ఒక్కటే మార్గమని వైద్యులు చెప్పారు. కానీ లంగ్స్ ఆయనకు లభించలేదు. దాతలు ఎవరూ లేరు. దీంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయారు. కాగా విద్యాసాగర్ మరణవార్త అందరినీ షాక్కు గురి చేస్తోంది.
కాగా మీనాకు విద్యాసాగర్కు 2009లో వివాహం అయింది. వీరికి నైనికా అనే కుమార్తె ఉంది. ఈమె బాలనటిగా ఇప్పటికే అదరగొట్టింది. విజయ్ పోలీసోడు సినిమాతోపాటు అరవింద్ స్వామి నటించిన భాస్కర్ ఒరు రాస్కెల్లోనూ నటించి మంచి మార్కులు కొట్టేసింది. అయితే విద్యాసాగర్ మరణించిన తీరుకు సినీ ఇండస్ట్రీ కూడా దిగ్భ్రాంతికి లోనవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…