Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు మళ్లీ తండ్రి అయ్యారు. ఆయన రెండో భార్య వైఘా రెడ్డి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దిల్ రాజు, వైఘా రెడ్డిలకు 2020లో లాక్ డౌన్ సమయంలో వివాహం జరిగింది. ఆయన మొదటి భార్య అనితా రెడ్డి 2017లో మృతి చెందిన విషయం విదితమే. తరువాత ఆయన వైఘా రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు ప్రస్తుతం కొడుకు పుట్టాడు. జూన్ 29 రాత్రి ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
కాగా దిల్రాజు మొదటి భార్యకు హర్షిత రెడ్డి అనే కుమార్తె జన్మించగా.. ఈమెకు వివాహం అయి పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే దిల్ రాజు, వైఘా రెడ్డిల వివాహం జరిగినప్పుడు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అయితే వీరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తల్లిదండ్రులు అయ్యారు. దీంతో దిల్ రాజు దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నయి.
దిల్ రాజు ఇప్పటికే అనేక హిట్ చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం ఈయన శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే విజయ్ వారసుడుతోపాటు పలు ఇతర చిత్రాలతో కూడా ఈయన బిజీగా ఉన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…