Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి ఇన్ని రోజుల పాటు ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ను ఎంజాయ్ చేశారు. సినిమా రిలీజ్ అయ్యాక కొద్ది రోజులకు ఆయన వెకేషన్కు వెళ్లి వచ్చారు. ఇక ఇప్పుడు ఆయన తన తరువాతి సినిమాపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా మహేష్, రాజమౌళి మూవీ ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. దీంతో సినిమాపై అప్పుడే భారీగా అంచనాలు పెరిగాయి. అయితే మహేష్తో చేయబోయే సినిమాను రాజమౌళి తాజాగా అధికారికంగా కన్ఫామ్ చేశారు. ఈ క్రమంలోనే సినిమాను తీసి రిలీజ్ చేసేందుకు 3 ఏళ్ల సమయం పడుతుందని చెప్పారు. అంటే 2025 లో ఈ ఇద్దరి మూవీ రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.
కాగా రాజమౌళి తన తదుపరి సినిమాకు గ్రాఫిక్స్ను అందించేందుకు గాను యూనిట్ ఇమేజ్ అనే సంస్థను సంప్రదించారు. తాజాగా ఆయన ఈ సంస్థకు చెందిన స్టూడియోకు వెళ్లి ఆ ఓనర్ను కలిశారు. ఫ్రాన్స్కు చెందిన యూనిట్ ఇమేజ్ సంస్థ 3డి యానిమేషన్, వీఎఫ్ఎక్స్ పనులు చేస్తుంది. మహేష్ తో చేయబోయే సినిమాకు గ్రాఫిక్స్ అందించేందుకు రాజమౌళి ఈ సంస్థను సంప్రదించారు. అయితే ఇప్పటి వరకు రాజమౌళి మకుట కంపెనీతో గ్రాఫిక్స్ చేయిస్తున్నారు. కానీ మహేష్ సినిమాకు వేరే సంస్థను ఎంపిక చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకనే యూనిట్ ఇమేజ్ సంస్థకు చెందిన స్టూడియోకు వెళ్లి ఆ ఓనర్ను కలిసి రాజమౌళి మాట్లాడారు. అయితే ఈ సంస్థకే మహేష్ మూవీ గ్రాఫిక్స్ పనులను అప్పగిస్తారా.. అన్న దానిపై క్లారిటీ లేదు. కానీ రాజమౌళి మాత్రం మహేష్తో సినిమా చేస్తున్నట్లు కన్ఫామ్ చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు. వీరి కాంబినేషన్లో రాబోతున్న తొలి చిత్రం కావడంతో దీనిపై సహజంగానే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్తో కలిసి సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం వరకు పూర్తి కానున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే 2023లో మహేష్, రాజమౌళి మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇందుకు గాను జక్కన్న ఇప్పటి నుంచే ప్రీ ప్రొడక్షన్ పనులను చూసుకుంటున్నారు. అయితే ఈ మూవీ గురించి కీలకమైన అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అది ఎప్పుడు వస్తుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…