Vikram Movie : అగ్ర హీరోల సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతున్న వేళ.. సీనియర్ నటుడు కమలహాసన్ నటించిన విక్రమ్ మూవీ మాత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలై చాలా రోజులు అవుతున్నప్పటికీ ఈ మూవీని థియేటర్లలో ఇంకా భారీ ఎత్తున ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలైన ఈ మూవీ భారతీయ సినిమా ఇండస్ట్రీలో సంచలనాలను సృష్టిస్తోంది. చిత్ర నిర్మాతలు, ఎగ్జిబిటర్లతోపాటు ట్రేడ్ వర్గాలు చెబుతున్న ప్రకారం కమలహాసన్ విక్రమ్ మూవీ తమిళనాడులో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. గతంలో ఈ రికార్డు బాహుబలి 2 పేరిట ఉండేది. దాన్ని విక్రమ్ మూవీ బద్దలు కొట్టింది.
విక్రమ్ మూవీ ఇప్పటికీ థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. దీంట్లో కమలహాసన్తోపాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాసిల్, సూర్యలు ఇతర కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ కథను అందించడంతోపాటు దర్శకత్వం కూడా వహించారు. ఇక కమలహాసన్ ఈ సినిమా అందించిన హిట్తో ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే దర్శకుడితోపాటు చిత్ర యూనిట్ సిబ్బందికి ఆయన వివిధ రకాల గిఫ్ట్లను అందించారు. అయితే విక్రమ్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.
విక్రమ్ సినిమాకు గాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో అందులో ఈ మూవీ విడుదల కానుంది. జూలై 8వ తేదీన ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. సినిమా విడుదల అయ్యాక నెల రోజుల అనంతరం ఓటీటీలోకి వస్తుండడం విశేషం. థియేటర్లలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కనుక ఓటీటీలోనూ అదే రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నారు. ఇక ఈ మూవీని హిందీ, తెలుగు, తమిళం భాషల్లో స్ట్రీమ్ చేయనున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…