Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్ర ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 29న చిత్రం విడుదల కానుండగా.. ఈ సినిమాకి వీలైనంత ప్రచారం దక్కేలా చేస్తున్నారు. అంతేకాక మీడియా ఇంటరాక్షన్ లో అనేక విషయాల గురించి చెప్పుకొస్తున్నారు. తాజాగా ఓ పాత్రికేయుడు.. చిరంజీవి సినిమా అంటేనే అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతాయి. అలాంటప్పుడు ఆచార్యకి టికెట్ రేటు పెంచవలసిన అవసరం ఉందా ? అని అడిగారు. దానికి చిరంజీవి మాట్లాడుతూ.. పాండమిక్ కారణంగా చాలా రంగాలు కుదేలయ్యాయి. అలా సినిమా పరిశ్రమ కూడా చాలా ఇబ్బందుల్లో పడింది.
వడ్డీగా రూ.50 కోట్లను కట్టడమనేది ఎప్పుడైనా విన్నారా ? ఎవరిస్తారు చెప్పండి ?. మేము ప్రభుత్వాలకు 42 శాతం పన్ను కడుతున్నాం.. అని అన్నారు. ఈ క్రమంలో టికెట్ ధరలు పెంచమని ప్రభుత్వాలను వేడుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. ప్రభుత్వాలు కనికరించి ఇలాంటి జీవోలు ఇస్తే మనకి ఇంత వినోదాన్ని ఇచ్చారు మనం కూడా ఒక పది రూపాయలు ఇద్దామని ప్రేక్షకులు అనుకుంటారు. ఇది అడుక్కుతినడం కాదు అని చిరంజీవి అన్నారు.
కాగా ఈ నెల 29 నుంచి మే 5 వరకు టికెట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఒక్కో టికెట్పై మల్టీప్లెక్స్లో రూ. 50, సాధారణ థియేటర్స్లో రూ. 30 పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆచార్య ఐదో ఆట ప్రదర్శనకు సైతం వారం రోజుల పాటు అనుమతి కల్పించింది. ఇక ఆచార్య చిత్రంలో రామ్చరణ్తో కలిసి నటించడమనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవకాశాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి. నటుడిగా రామ్చరణ్ కెరీర్ గ్రాఫ్ దూసుకుపోయే స్థితిని చూడడం తండ్రిగా గొప్ప అనుభూతి. రామ్చరణ్ తన కెరీర్ను మలుచుకొనే తీరు అద్బుతంగా ఉంది.. అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…