Acharya Movie First Review : చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమాపై మెగాభిమానులతోపాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ ఎంత ఆసక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలుమార్లు వాయిదా పడిన తర్వాత ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అతి కీలకమైన సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా ఉంది. ఇక ఈ సినిమాకి సెన్సార్ రివ్యూ కూడా పాజిటివ్ గానే రావడం విశేషం. ఆచార్య ఫస్ట్ హాఫ్ మామూలుగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో యాక్షన్, ఎంటర్టైన్మెంట్, చిరంజీవి, రామ్చరణ్ల కలయికలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయట.
చిత్రంలో సెకండాఫ్లో రామ్ చరణ్ కనిపిస్తాడని ఆయన పాత్ర చిరంజీవి కన్నా పవర్ ఫుల్గా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఎక్కువగా హైందవ సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ.. ధర్మస్థలిని కాపాడేందుకు జరిగే పోరాటం చుట్టూ కథ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇలా సినిమాకు పాజిటివ్ గానే సెన్సార్ టాక్ వచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా క్లైమాక్స్ పవర్ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి మెగా అభిమానులను అలరించేలా ఈ సినిమా ఉందని అంటున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుందని అంటున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర చనిపోతుందనే టాక్ నడుస్తోంది. గతంలో రామ్ చరణ్ నటించిన మగధీర, ఎవడు చిత్రాల్లో చనిపోయే పాత్రల్లో నటించారు. ఆయా సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. అదే కోవలో ఆచార్యకు రామ్ చరణ్ పాత్ర సిద్ధ చనిపోవడం కలిసి వస్తోందని అభిమానులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. కొరాటాల ఈ సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించాడని, సినిమా ప్రేక్షకులకి కొత్త అనుభవం అందిస్తుందని అంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…