సాధారణంగా చాలా మందికి నెలకు రూ.లక్షల్లో జీతం పొందుతున్నప్పటికీ కొంతమంది ప్రభుత్వ అధికారులు మాత్రం వారి వక్రబుద్ధి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే అవినీతి శాఖ అధికారులకు దొరికి ఉద్యోగాలు కోల్పోతున్న ఘటనలను ఎన్నో చూస్తున్నాం. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్లోని గోల్కొండ ఇబ్రహీంబాగ్ విద్యుత్ సబ్డివిజన్ కార్యాలయంలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం..
ఇబ్రహీంబాగ్ విద్యుత్ సబ్డివిజన్లో చరణ్సింగ్ ఏడీఈగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మొయినాబాద్, శంకర్పల్లి, నార్సింగ్, ఇబ్రహీంబాగ్ డివిజన్లలో జరిగే పనులను పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ ఉద్యోగం నిర్వహిస్తున్నందుకు చరణ్ సింగ్ నెలకు ఏకంగా 2 లక్షల రూపాయల జీతం అందుకుంటున్నాడు. మణికొండకు చెందిన రవి అనే వ్యక్తి ఇదే శాఖలో చిన్నచిన్న కాంట్రాక్టు పనులను చేసేవాడు. ఈ క్రమంలోనే అందుకు అవసరమైన అనుమతి పత్రాన్ని ఇవ్వడం కోసం చరణ్ సింగ్ ఏకంగా అతన్ని లంచం అడిగాడు.
కాంట్రాక్టర్ రవి ఈ విషయాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులకు తెలియజేశాడు. ఈ క్రమంలోనే అధికారుల సూచనల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం రవి రూ.30వేలతో ఏడీఈ కార్యాలయానికి వెళ్లాడు. చరణ్ సింగ్కు డబ్బులు ఇస్తున్న క్రమంలో అవినీతి శాఖ అధికారులు దాడి చేసి అతనిని అరెస్టు చేసే.. అనంతరం ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించారు. అనంతరం జైలుకు పంపించినట్లు తెలిపారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…