Walking : చాలా మంది భోజనం చేసిన తరువాత వెంటనే నిద్రిస్తుంటారు. ఇంకొందరు టీ, కాఫీ తాగుతారు. అయితే ఇవి ఆరోగ్యకరమైన విధానాలు అయితే కావని వైద్య నిపుణులు చెబుతున్నారు. మీ జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండాలంటే మీరు భోజనం చేశాక తప్పనిసరిగా తేలికపాటి వాకింగ్ చేయాలి. మీరు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా రోజూ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. తిన్న తరువాత చిన్నపాటి దూరం నడవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం చేసిన అనంతరం చిన్నపాటి దూరం వరకు తేలిగ్గా నడవడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణశక్తి మెరుగు పడుతుంది. జీర్ణాశయంలో ఉండే కండరాలు బలపడతాయి. పేగులకు ఆరోగ్యం కలుగుతుంది. పేగులలో ఆహారం సులభంగా కదులుతుంది. దీంతో గుండెల్లో మంట, మలబద్దకం, కడుపు ఉబ్బరం, అసిడిటీ, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు తగ్గుతాయి. భోజనం చేసిన తరువాత వాకింగ్ చేయడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. దీంతో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. ఫలితంగా డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
తిన్న తరువాత వాకింగ్ చేస్తే క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయ పడుతుంది. వాకింగ్ వల్ల మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో శక్తిస్థాయిలు పెరుగుతాయి. కండరాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. తిన్న తరువాత వాకింగ్ చేయడం వల్ల హైబీపీ తగ్గుతుంది. రాత్రి పూట భోజనం అనంతరం కేవలం 5 నుంచి 10 నిమిషాల పాటు వాకింగ్ చేసినా చాలు ఈ ప్రయోజనాలను పొందవచ్చు. దీంతో నిద్ర కూడా చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడతారు. అయితే తిన్న వెంటనే కాకుండా 10 నిమిషాలు ఆగాక వాకింగ్ చేయాలి. దీంతో మరిన్ని లాభాలను పొందవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…