Coconut Offering To God : హిందువులు ఏ కార్యం తలపెట్టినా లేదంటే దేవాలయాలను సందర్శించినా, పూజలు చేసినా తప్పనిసరిగా పూజ అనంతరం కొబ్బరికాయ కొడుతుంటారు. ఇక కొందరు అయితే వారంలో తమ ఇష్టదైవాన్ని పూజించిన రోజు తప్పకుండా కొబ్బరికాయ కొడతారు. శుభకార్యాల్లోనూ వీటి వాడకం ఎక్కువగానే ఉంటుంది. అయితే కొబ్బరికాయలు ఎందుకు అంత పవిత్రం అయ్యాయి ? పూజ చేసినప్పుడు కేవలం వీటినే ఎందుకు కొడతారు ? కొబ్బరికాయలకు అంత ప్రాధాన్యత ఎందుకు ఏర్పడింది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరికాయలో మీద ఉన్న భాగాన్ని మన అహంతో పోలుస్తారు. లోపలి తెల్ల భాగాన్ని స్వచ్ఛమైన మనస్సుకు చిహ్నంగా భావిస్తారు. ఈ క్రమంలోనే కొబ్బరికాయను పగలగొట్టడం అంటే.. మన అహాన్ని వదిలి స్వచ్ఛమైన మనస్సుతో దైవాన్ని పూజించడం అన్నమాట. అందుకనే కొబ్బరికాయ పగలగొడతారు. ఇక శ్రీహరికి అత్యంత ఇష్టమైన వాటిల్లో కొబ్బరికాయ ఒకటి. అందుకనే కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడతారు. అలాగే కొబ్బరికాయకు ఉండే మూడు కళ్లు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తాయి. కనుకనే కొబ్బరికాయ పవిత్రంగా మారింది. అందుకనే దానికి అంత ప్రాధాన్యతను కల్పించారు.
ఇక కొబ్బరితోపాటు అరటి పండ్లను కూడా పవిత్రంగానే భావిస్తారు. వీటిని కూడా నైవేద్యం పెడతారు. వాస్తవానికి కొబ్బరి చెట్లు, అరటి చెట్లు విత్తనాలు లేకుండానే పెరుగుతాయి. వాటి నుంచి వచ్చే పిలకలతో మొక్కలుగా ఎదుగుతాయి. కనుకనే వీటిని పవిత్రంగా భావించి నైవేద్యం కోసం ఉపయోగిస్తారు. ఇక కొబ్బరికాయను కొట్టడం వల్ల నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అందువల్ల కూడా కొబ్బరికాయను కొట్టడం ఆచారంగా వస్తోంది.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…