Mahabharat : హిందూ పురాణాల్లో మహాభారతం కూడా ఒకటి. ఇందులో కేవలం పాండవులు, కౌరవుల మధ్య జరిగిన కథ మాత్రమే కాకుండా మనకు జీవితంలో ఉపయోగపడే అనేక అంశాలు దాగి ఉంటాయి. వాటిని మనం జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. ఈ క్రమంలోనే మనం మహాభారతం నుంచి మన నిత్య జీవితానికి అనేక అంశాలను ఆపాదించుకోవచ్చు. అయితే అన్నీ అవసరం లేదు కానీ మనం అలా మహాభారతం నుంచి అనుసరించాల్సిన 5 ముఖ్యమైన అంశాలు అయితే ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన జీవితాంతం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉండాలి. నాకు చాలా తెలుసు, ఇంక చాలు, నాకు చాలా జ్ఞానం ఉంది, నాకంతా తెలుసు, నేనేమీ ఇక నేర్చుకోవాల్సిన పనిలేదు, అని అనుకోకూడదు, ఎందుకంటే అర్జునుడు తన జీవితం మొత్తం ఏదో ఒక విద్యలో ప్రావీణ్యతను సంపాదిస్తూనే ఉన్నాడు. ఇదే మనకు ఆదర్శం. ఇక ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకుంటే పూర్తిగా తెలుసుకోవాలి. లేకపోతే అసలు దాని గురించి పట్టించుకోకూడదు. ఎందుకంటే అభిమన్యుడు పద్మవ్యూహం గురించి సగమే తెలుసుకుని అందులోకి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కనుక ఏదైనా విషయంలో ఉంటే పూర్తి జ్ఞానం ఉండాలి. లేదంటే అసలు జ్ఞానం లేకపోవడమే మంచిది.
ఇక కర్ణుడు, దుర్యోధనుడి కథ విషయానికి వస్తే.. సహాయం చేయని స్నేహితులు 100 మంది ఉన్నా వృథాయే. సహాయం చేసే నమ్మకస్తుడైన స్నేహితుడు ఒక్కడు ఉన్నా చాలు. కర్ణుడు దుర్యోధనున్ని ఇలా చాలా సార్లు రక్షించాడు. ఇక ప్రతీకారం అనేది నిన్ను పాతాళానికి తొక్కేస్తుంది. అది శకుని విషయంలో రుజువు అవుతుంది. కౌరవులపై శకుని ప్రతీకారం తీర్చుకోవాలని వారితో స్నేహం చేసి చివరకు శకుని కూడా పాతాళంలోకి వెళ్లిపోయాడు. అందువల్ల ప్రతీకారం అనేది పనికిరాదు. ఇక ఏం చేసినా పక్కా ప్రణాళికతో చేయాలి. శ్రీకృష్ణుడు పాండవులతో కలిసి యుద్ధ వ్యూహాలు రచించి అమలు చేయించాడు. కనుకనే వారికి సైన్యం తక్కువగా ఉన్నా విజయం సాధించగలిగారు. అందువల్ల ఏం పనిచేసినా పక్కా ప్లాన్తోనే చేయాలి. ఎలాంటి ప్లాన్ లేకుండా ఏం చేసినా విజయం సాధించలేరు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…