స‌మాచారం

PM Kisan Yojana : పీఎం కిసాన్ డ‌బ్బులు రాలేదా.. అయితే ఇలా చేయండి..!

PM Kisan Yojana : ప్ర‌ధాని మోదీ దేశ‌వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం పీఎం కిసాన్ యోజ‌న (ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న‌) ప‌థ‌కాన్ని గ‌తంలోనే ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం విదిత‌మే. ఈ ప‌థ‌కం రైతుల‌కు ఒక వరం లాంటిది. ఇప్ప‌టికే ఎన్నో కోట్ల మంది రైతులు ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ధి పొందుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రోమారు మోదీ అధికారంలోకి వ‌చ్చారు క‌నుక మ‌ళ్లీ ఈ ప‌థ‌కం కింద రైతుల‌కు 17వ ద‌ఫా కింద న‌గ‌దును బ‌దిలీ చేశారు. గ‌తంలో ఫిబ్ర‌వ‌రి 28వ తేదీన 16వ ద‌ఫా న‌గ‌దును ఇచ్చారు. ఇప్పుడు 17వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను రిలీజ్ చేశారు. దీనిపై మోదీ ప్ర‌ధాని అయ్యాక తొలి సంత‌కం చేశారు. ప్ర‌స్తుతం ఖ‌రీఫ్ స‌మ‌యం ఆరంభం అయింది. అందువ‌ల్ల రైతుల పెట్టుబ‌డికి ఈ న‌గదు ఉప‌యోగం కానుంది.

అయితే ఈ ప‌థ‌కంలో మీరు ల‌బ్ధిదారులుగా ఉన్న‌ప్ప‌టికీ న‌గ‌దు బ‌దిలీ అవ‌డం లేదు అంటే మీరు ఈ-కేవైసీ చేయించుకోలేద‌ని అర్థం. ఈ క్ర‌మంలోనే దీనికి సంబంధించిన వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. పీఎం కిసాన్ ప‌థ‌కానికి సంబంధించిన ఇన్‌స్టాల్‌మెంట్ ను ప్ర‌తి ఏడాది జూన్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా స‌మ‌యానికే రిలీజ్ చేశారు. అయితే ఈ న‌గ‌దు ఈ నెల చివ‌రి వ‌ర‌కు రైతుల ఖాతాల్లో జ‌మ కానుంది. ఇక ఈ విడ‌త కింద రూ.2వేల‌ను ఇస్తున్నారు. ఈ ప‌థ‌కం కింద న‌మోదు చేసుకున్న రైతులు త‌ప్ప‌నిస‌రిగా ఈ-కేవైసీ అప్‌డేట్ చేయించుకోవాలి. లేదంటే న‌గ‌దు బ‌దిలీ అవ‌దు. క‌నుక ఈ-కేవైసీ స‌రిగ్గా ఉందో లేదో రైతులు చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది.

PM Kisan Yojana

పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి అక్క‌డ ఈ-కేవైసీ అనే ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. అక్క‌డ 12 అంకెలున్న మీ ఆధార్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి. అనంత‌రం సెర్చ్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. దీంతో మీ మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. దాన్ని న‌మోదు చేయాలి. త‌రువాత స‌బ్‌మిట్‌పై క్లిక్ చేయాలి. దీంతో మీ కేవైసీ పూర్త‌వుతుంది. అయితే మీరు ఇచ్చిన స‌మాచారంలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని స‌రిచేసుకోవ‌చ్చు. లేదంటే మీ బ్యాంకు ఖాతాలో న‌గ‌దు బ‌దిలీ అవ‌దు. క‌నుక ఇలాంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు pmkisan-ict@gov.in కి ఈ-మెయిల్ పంపించ‌వ‌చ్చు. లేదా పీఎం కిసాన్ యోజన ఫోన్‌ నంబర్స్ 155261, 1800115526(టోల్ ఫ్రీ), లేదా 011-23381092కు కాల్ చేయ‌వ‌చ్చు.

కాగా కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక ప‌థ‌కాల‌ను అందిస్తుండ‌గా వాటిల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. దీని ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భరోసాను ఇస్తుంది. పెట్టుబడి స‌హాయం అందిస్తుంది. ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు ప్రతి ఏడాది రూ. 6000 అందిస్తున్నారు. అయితే దీనిని ఒకేసారి కాకుండా 3 సమాన ఇన్‌స్టాల్‌మెంట్లలో అందిస్తుంది. అంటే ప్రతి ఇన్‌స్టాల్‌మెంట్లో రూ. 2000 చొప్పున రైతులకు వ‌స్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM

28 రోజుల రీచార్జ్ ప్లాన్‌ పేరుతో దోపిడీ.. పార్లమెంట్‌లో రాఘవ్ చద్దా ఫైర్!

రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…

Thursday, 12 March 2026, 7:33 PM