PM Awas Yojana : దేశంలోని పౌరుల సొంతింటి కలను నిజం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన పథకమే.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. ఈ పథకం కింద పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు తక్కువ ఖర్చులోనే ఇంటిని నిర్మించుకోవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉండే వారు ఈ పథకానికి అర్హులు. దీన్ని 2015లో జూన్ 25వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇంటి రుణాలపై సబ్సిడీని అందిస్తుంది. ఇంటి యజమానికి వచ్చే ఆదాయంపై ఆధారపడి సబ్సిడీని అందిస్తారు. ఈ పథకం కింద బ్యాంకులు కూడా తక్కువ వడ్డీ రేట్లకే ఇంటి రుణాలను అందిస్తున్నాయి. ఈ పథకం కింద లబ్ధి పొందిన వారు తీసుకున్న రుణం మొత్తాన్ని 20 ఏళ్లలోగా చెల్లించాల్సి ఉంటుంది. గత 10 ఏళ్ల నుంచి ఈ పథకం కింద మొత్తం 4.1 కోట్ల మంది లబ్ధి పొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే లబ్ధిదారుడి వయస్సు 18 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ ఉండాలి. భారతీయ పౌరుడు అయి ఉండాలి. దేశంలో ఎక్కడా అతని పేరు మీద ఇల్లు ఉండకూడదు. లబ్ధిదారుడి ఏడాది ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల మధ్యే ఉండాలి. అంతకన్నా మించరాదు. లబ్ధిదారుడి రేషన్ కార్డు బీపీఎల్ లిస్ట్లో ఉండాలి. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ పథకం కింద లబ్ధి అందిస్తారు. ఇక ఇందుకు ఏయే డాక్యుమెంట్లు కావాలో ఇప్పుడు చూద్దాం.
ఆధార్ కార్డు, పాస్పోర్టు సైజ్ కలర్ ఫొటో, స్వచ్ఛ భారత్ మిషన్ రిజిస్ట్రేషన్ నంబర్, బ్యాంకు పాస్బుక్, మొబైల్ నంబర్, ఆదాయ ధ్రువీకరణ పత్రం తదితర పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ఆన్లైన్లో pmaymis.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేయవచ్చు. ఈ వెబ్సైట్ను సందర్శించాక అందులో హోమ్ పేజీలో ఉండే Pmavasyojana అనే లింక్ను క్లిక్ చేయాలి. అందులో రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయాలి. అనంతరం వచ్చే ఫామ్ లో అన్ని వివరాలను నమోదు చేయాలి. అనంతరం డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. అనంతరం సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. దీంతో దరఖాస్తు ఫామ్ సబ్మిట్ అవుతుంది.
ఆఫ్లైన్లోనూ ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు గాను పౌరులు తమకు సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ను సందర్శించాల్సి ఉంటుంది. అప్లై చేసే సమయంలో పైన తెలిపిన అన్ని డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఒరిజినల్ పత్రాలను చూపించి జిరాక్స్ కాపీలను ఇవ్వాలి. దీంతో అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. ఈ క్రమంలో మీ వివరాలను పరిశీలించాక మీరు అర్హులైతే మీకు ఈ పథకం కింద లబ్ధి లభిస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…