PM Awas Yojana : దేశంలోని పౌరుల సొంతింటి కలను నిజం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన పథకమే.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. ఈ పథకం కింద పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు తక్కువ ఖర్చులోనే ఇంటిని నిర్మించుకోవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉండే వారు ఈ పథకానికి అర్హులు. దీన్ని 2015లో జూన్ 25వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇంటి రుణాలపై సబ్సిడీని అందిస్తుంది. ఇంటి యజమానికి వచ్చే ఆదాయంపై ఆధారపడి సబ్సిడీని అందిస్తారు. ఈ పథకం కింద బ్యాంకులు కూడా తక్కువ వడ్డీ రేట్లకే ఇంటి రుణాలను అందిస్తున్నాయి. ఈ పథకం కింద లబ్ధి పొందిన వారు తీసుకున్న రుణం మొత్తాన్ని 20 ఏళ్లలోగా చెల్లించాల్సి ఉంటుంది. గత 10 ఏళ్ల నుంచి ఈ పథకం కింద మొత్తం 4.1 కోట్ల మంది లబ్ధి పొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే లబ్ధిదారుడి వయస్సు 18 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ ఉండాలి. భారతీయ పౌరుడు అయి ఉండాలి. దేశంలో ఎక్కడా అతని పేరు మీద ఇల్లు ఉండకూడదు. లబ్ధిదారుడి ఏడాది ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల మధ్యే ఉండాలి. అంతకన్నా మించరాదు. లబ్ధిదారుడి రేషన్ కార్డు బీపీఎల్ లిస్ట్లో ఉండాలి. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ పథకం కింద లబ్ధి అందిస్తారు. ఇక ఇందుకు ఏయే డాక్యుమెంట్లు కావాలో ఇప్పుడు చూద్దాం.
ఆధార్ కార్డు, పాస్పోర్టు సైజ్ కలర్ ఫొటో, స్వచ్ఛ భారత్ మిషన్ రిజిస్ట్రేషన్ నంబర్, బ్యాంకు పాస్బుక్, మొబైల్ నంబర్, ఆదాయ ధ్రువీకరణ పత్రం తదితర పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ఆన్లైన్లో pmaymis.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేయవచ్చు. ఈ వెబ్సైట్ను సందర్శించాక అందులో హోమ్ పేజీలో ఉండే Pmavasyojana అనే లింక్ను క్లిక్ చేయాలి. అందులో రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయాలి. అనంతరం వచ్చే ఫామ్ లో అన్ని వివరాలను నమోదు చేయాలి. అనంతరం డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. అనంతరం సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. దీంతో దరఖాస్తు ఫామ్ సబ్మిట్ అవుతుంది.
ఆఫ్లైన్లోనూ ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు గాను పౌరులు తమకు సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ను సందర్శించాల్సి ఉంటుంది. అప్లై చేసే సమయంలో పైన తెలిపిన అన్ని డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఒరిజినల్ పత్రాలను చూపించి జిరాక్స్ కాపీలను ఇవ్వాలి. దీంతో అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. ఈ క్రమంలో మీ వివరాలను పరిశీలించాక మీరు అర్హులైతే మీకు ఈ పథకం కింద లబ్ధి లభిస్తుంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…