రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా ఫిబ్రవరి 22వ తేదీ వరకు గడువు ఉంది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం 32,438 లెవల్ 1 గ్రూప్ డి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టెన్త్ లేదా ఐటీఐ చదివిన వారు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో 1642 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు https://www.rrbapply.gov.in/#/auth/landing అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.
అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, కోల్కతా, మాల్దా, ముంబై, పాట్నా, ప్రయాగ్ రాజ్, రాంచీ, సికింద్రాబాద్ జోన్లలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం గ్రూప్ డి పోస్టుల సంక్య 32,438 ఉండగా పాయింట్స్మన్- 5,058, అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్)- 799, అసిస్టెంట్ (బ్రిడ్జ్)- 301, ట్రాక్ మెయింటెయినర్ గ్రూప్-4 – 13,187, అసిస్టెంట్ పీ-వే- 247, అసిస్టెంట్ (సీ అండ్ డబ్ల్యూ)- 2587, అసిస్టెంట్ లోకో షెడ్ (డిజిల్)- 420, అసిస్టెంట్ (వర్క్షాప్)- 3077, అసిస్టెంట్ (ఎస్ అండ్ టీ)- 2012, అసిస్టెంట్ టీఆర్డీ- 1381, అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్)- 950, అసిస్టెంట్ ఆపరేషన్స్- (ఎలక్ట్రికల్)- 744, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ- 1041, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ (వర్క్షాప్)- 625 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరిలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.18వేల ప్రారంభ జీతం చెల్లిస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500 కాగా రిజర్వ్డ్ విభాగాలకు చెందిన వారు రూ.250 చెల్లించాలి. ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…