దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు పోస్టుల భర్తీకి గాను దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో మొత్తం 4500 అప్రెంటిస్, ఎస్వో పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ను రిలీజ్ చేశారు. 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, మాతృభాషలో ప్రావీణ్యత, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి. వయస్సు 20 నంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఇచ్చారు. ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా మార్చి 11వ తేదీ వరకు గడువుగా నిర్ణయించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు రూ.800 అప్లికేషన్ ఫీజు చెల్లించాఇ. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే చాలు.
పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15000 స్టయిపెండ్గా చెల్లిస్తారు. ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. అదే స్పెషలిస్ట్ ఆఫీసర్ (ఎస్వో) పోస్టులకు నెలకు రూ.64,400 చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు https://nats.education.gov.in/ అనే సైట్ లేదా http://www.bankofbaroda.in/Career.htm అనే సైట్ను సందర్శించవచ్చు.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…