Tea And Coffee : చాలామంది ఉదయం లేచిన వెంటనే టీ, కాఫీలని తీసుకుంటూ ఉంటారు. టీ, కాఫీ కంటే కూడా ఆరోగ్యానికి మేలు చేసే వాటిని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే రోజూ ఉదయం టీ, కాఫీ కాకుండా వీటిని తీసుకోండి. వీటిలో ఏ ఒక్కటి తీసుకున్నా కూడా ఆరోగ్యం బాగుంటుంది. చాలా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.
మరి ఉదయం పూట టీ, కాఫీ మానేసి ఏం తీసుకోవాలి.. అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర లేవగానే చాలా మంది టీ, కాఫీ తీసుకుంటూ ఉంటారు. ఉదయం నిద్ర లేచిన తర్వాత నుండి అల్పాహారం దాకా ఒకటి కంటే ఎక్కువ సార్లు టీ, కాఫీలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా ఈ పానీయాలను తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది.
ఉదయం లేచాక పసుపు, మిరియాలతో టీ చేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. రెండు స్పూన్ల వరకు పసుపు తీసుకొని అందులో మిరియాలు కలిపి గోరువెచ్చని నీటితో తీసుకుంటే జీవక్రియ పెరుగుతుంది. శరీరంలో అదనపు కొవ్వు కరిగిపోతుంది. జీలకర్ర, వాము కలిపి తీసుకుంటే కూడా చక్కటి ప్రయోజనం ఉంటుంది. రెండు కప్పుల దాకా నీళ్లు తీసుకుని చిటికెడు జీలకర్ర, వాము వేసి మరిగించుకోండి.
సగం అయిన తర్వాత వడపోసి తీసుకోండి. దీంతో జీవక్రియని వేగవంతం చేయొచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఉదయం పూట లేవగానే ఖాళీ కడుపుతో గ్లాసు గోరు వెచ్చని నీటిని తీసుకోండి. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవచ్చు. జీవక్రియలను వేగవంతం చేసుకోవచ్చు. వేడి నీటిలో నిమ్మరసం వేసుకొని కొద్దిగా తేనె కూడా వేసుకొని ఉదయాన్నే తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. చాలామంది ఇలా తీసుకుంటూ ఉంటారు. అయితే ఉదయం పూట టీ కాఫీలు తీసుకోకుండా ఉండలేము అని అనుకునేవారు టీ, కాఫీలని తీసుకునే ముందు నానబెట్టిన బాదం కానీ గుమ్మడి గింజల్ని కానీ తీసుకోండి. దీంతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…