Bedi Anjaneya Swamy Temple : తిరుమల సన్నిధి వీధిలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఈ ఆంజనేయస్వామిని బేడీలతో బంధించారు. అయితే చాలామంది తిరుమల ఎన్నోసార్లు వెళ్లి ఉంటారు. కానీ ఈ బేడి ఆంజనేయస్వామి గురించి తెలియకపోయి ఉండొచ్చు. మరి ఈ ఆంజనేయస్వామిని ఎందుకు బేడీలతో బంధించారు, కారణం ఏంటి.. వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.
వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి అక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత ఇక్కడికి కూడా నైవేద్యాన్ని తీసుకువస్తారు. పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే హనుమంతుడు చిన్నతనంలో ఒంటెను వెతకడానికి తిరుమలని విడిచి పెట్టాలని అనుకుంటాడు. అతని తల్లి అంజనాదేవి ఆయన మణికట్టుకి బేడీలతో కట్టి ఆమె తిరిగి వచ్చేదాకా ఆ ప్రదేశంలో ఉండమని ఆదేశించిందని కొన్ని కథనాలు చెబుతున్నాయి. అంజనాదేవి ఆకాశగంగ ప్రాంతంలో ఉండిపోయింది. తిరిగి రాలేదని పురాణాల ప్రకారం తెలుస్తోంది.
ఈ ఆలయంలోని హనుమంతుని రెండు చేతులకి సంకెళ్లు వుంటాయి. ఇలా ఒక ప్రత్యేక ఆకృతిలో ఈ హనుమంతుడు వుంటాడు. ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. భక్తులు ఇక్కడికి వచ్చి వారి యొక్క కష్టాలని, కోరికల్ని చెప్పుకుంటే ఆ కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇప్పటికీ ఆ ఆంజనేయస్వామి అక్కడే స్థిరపడి ఉన్నట్లు వైష్ణవ సంప్రదాయాల ప్రకారం ప్రధాన ఆలయానికి ఎదురుగా గరుడగా ఈయన వెలసినట్లు తెలుస్తోంది.
తిరుమలలో శ్రీ బేడి ఆంజనేయస్వామి.. వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఎదురుగా కనిపిస్తాడు. ప్రతి ఆదివారం కూడా శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అభిషేకాలని కూడా నిర్వహిస్తారు. ఈ బేడి ఆంజనేయస్వామి ఆలయంలో కూడా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుతారు. తిరుమలకి వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని మీరు చూడొచ్చు. వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఎదురుగా శ్రీ బేడి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. నడిచి వెళ్ళిపోవచ్చు. ఆలయం అఖిలాండం పక్కనే ఉంది. ప్రతిరోజు ఉదయం 5:30 నుండి రాత్రి 9 వరకు కూడా ఈ ఆలయం తెరచి ఉంటుంది.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…