Rainy Season : వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే, ఆరోగ్యం పట్ల కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. వానా కాలంలో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి పోషకాహారాన్ని తీసుకోవాలి. మంచి పోషకాహారాన్ని మీరు కనుక తీసుకున్నట్లయితే, వానా కాలంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. అయితే వానా కాలంలో ఆకుకూరలకి దూరంగా ఉండాలి.
వానాకాలంలో ఆకుకూరలను తీసుకోవడం వలన అనేక రకాల సమస్యలకి మీరు గురయ్యే అవకాశం ఉంటుంది. వానా కాలంలో వీలైనంత వరకు ఆకుకూరలకి దూరంగా ఉండాలి. ఆకుకూరలపై బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న పురుగులు నీటి ద్వారా ఈ ఆకుకూరలని వ్యాపించి ఆ ఆకుల చివర్లలో గుడ్లని పెడుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఆకుకూరలని తీసుకుంటే ఇన్ఫెక్షన్లు వస్తాయి.
వానా కాలంలో చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఆహారాలని కూడా తీసుకోకూడదు. ఇవి కూడా అనారోగ్య సమస్యల్ని కలిగిస్తాయి. వానా కాలంలో నీటిలో వ్యాధికారిక బ్యాక్టీరియా చేపలకి సోకవచ్చు. చేపల సంతాన ఉత్పత్తి కాలంలో సీ ఫుడ్ లో ఎన్నో మార్పులకి కారణం అవుతుంది. ఆరోగ్యానికి ఇది హాని కలగొచ్చు.
అదే విధంగా వానాకాలంలో పకోడీలు, సమోసాలు లాంటి వేయించిన ఆహార పదార్థాలను తీసుకుంటే అజీర్తి వంటి సమస్యలు కలుగుతాయి. కాబట్టి అలాంటి ఆహార పదార్థాలను కూడా తీసుకోవద్దు. వానా కాలంలో చల్లగా వాతావరణం ఉందని, చాలామంది నీళ్లు తీసుకోరు కానీ నీళ్లు తీసుకోకపోవడం వలన డీహైడ్రేషన్ కలగొచ్చు. కాబట్టి నీళ్లను తీసుకోండి.
కూల్ డ్రింక్స్ వంటి వాటిని అసలు వానాకాలంలో తీసుకోవద్దు. పుట్టగొడుగులని కూడా తీసుకోవద్దు. తడి నేలలో ఇవి పెరుగుతాయి. బ్యాక్టీరియా పెరుగుదలని కలిగి ఉంటాయి. కనుక వానా కాలంలో పుట్టగొడుగులను తీసుకుంటే కూడా సమస్యలు కలుగుతాయి. పచ్చి ఆహారాన్ని తీసుకుంటే, వ్యాధికారిక క్రిములు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. వానా కాలంలో పెరుగు తినడం వలన ఆహారంలో చల్లని స్వభావం వలన శరీరానికి హాని కలగొచ్చు. కాబట్టి ఈ పొరపాట్లు చేయొద్దు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…