Konda Pindi Aaku : మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యల్లో మూత్రాశయ ఇన్ఫెక్షన్ల సమస్య కూడా ఒకటి. ఇది పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఎక్కువగా వస్తుంది. అయితే ఈ సమస్య సహజంగా నీరు ఎక్కువగా తాగకపోవడం వల్ల కూడా వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ఉంటే విపరీతమైన నొప్పి ఉంటుంది. మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మంట అనిపిస్తాయి. మూత్రం రంగు మారుతుంది. మూత్రం చాలా తక్కువగా వస్తుంది. ఈ లక్షణాలు ఉంటే కచ్చితంగా అది మూత్రాశయ ఇన్ఫెక్షన్ అని అనుమానించాలి.
ఇక ఈ సమస్యను తగ్గించడానికి కొండపిండి ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మనకు ఎక్కడ చూసినా లభిస్తుంది. రహదారుల పక్కన, గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. దీన్ని సేకరించడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. ఇక కొండ పిండి ఆకులో మూత్రాశయ ఇన్ ఫెక్షన్ మీద పోరాటం చేసే లక్షణాలు సమృద్దిగా ఉంటాయి. కొండపిండి ఆకు మనకు ఎక్కడైనా సరే విరివిగా లభ్యం అవుతుంది. ఈ ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో మరిగించి డికాషన్ చేసుకొని తాగవచ్చు.
కొండపిండి ఆకు లేకపోతే కొండపిండి ఆకు పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది. ఈ పొడిని నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి తాగవచ్చు. ఈ విధంగా తాగడం వల్ల మూత్రాశయ ఇన్ ఫెక్షన్ తగ్గడమే కాకుండా కిడ్నీలో రాళ్ళ సమస్య, మూత్రంలో మంట, శరీరంలో వేడి.. ఇలా అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. కనుక ఈ ఆకు ఎక్కడ కనిపించినా సరే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకుని ఉపయోగించండి. దీంతో మూత్రాశయ సంబంధిత సమస్యల నుంచి బయట పడవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…