Curries : మిగిలిపోయిన ఆహార పదార్థాలను చాలా మంది పారేయకూడదని, అనవసరంగా వృథా అవుతుందని, దాచుకొని మళ్ళీ తింటూ ఉంటారు. చాలామంది ఇళ్లల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతూ ఉంటుందా..? అయితే కచ్చితంగా ఈ విషయాలని మీరు తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి మనం ఎక్కువ వండుకోవడం, లేదంటే తక్కువ తినడం వలన కూరలు మిగిలిపోతూ ఉంటాయి. అంత రేటు పెట్టి కొన్నాము.. అంత కష్టపడి వంట చేసుకున్నాం.. రుచి బాగుంది కదా అని చాలామంది ఫ్రిజ్లో పెట్టుకుని మరుసటి రోజు తింటూ ఉంటారు.
అయితే అటువంటి వాళ్ళు కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే భర్తల కోసం అని లేదంటే సమయం లేదని ఒకే సారి ఎక్కువ కూరలు చేసుకుని ఫ్రిజ్లో పెట్టుకుని తింటుంటారు. వాటిని టైం చూసుకుని వేడి చేసుకుని తింటూ ఉంటారు. ఆహార పదార్థాలని అలా వదిలేయడం వలన గాలిలో ఉండే క్రిములు వాటిని పట్టుకుంటూ ఉంటాయి.
ఇలా నెమ్మదిగా ఆహారం పాడైపోతుంది. క్రిములు ఆహార పదార్థాలలోకి వెళ్లి ఆహార పదార్థాలని పాడుచేస్తూ ఉంటాయి. దాంతో కూర వాసన రావడం లేదంటే పాడైపోవడం వంటివి కనపడుతుంటాయి. ప్రతి గంటకి కూడా ఏదో ఒక మార్పు అందులో ఉంటుంది. అయితే,ఆహార పదార్ధం పాడైందని మనం కేవలం రుచి వాసన బట్టి మాత్రమే చెప్పగలము. కొంతమంది ఏం చేస్తారంటే ఆహార పదార్థాలు బయట ఉంటే పాడైపోతాయని కూరల్ని ఫ్రిజ్లో పెట్టుకుంటూ ఉంటారు.
ఫ్రిజ్లో పెట్టుకుని కూరలు తీసుకోవడం వలన ఎలాంటి జబ్బులు కూడా రావు. కానీ చాలామంది అలా తినరు. ఫ్రెష్ గా వేడివేడిగా తినేవాళ్లు ఒక్కసారిగా ఇలా దాచుకుని కూరలు తినడం వలన శరీరానికి అలవాటు లేకపోవడంతో ఇబ్బందులు రావచ్చు. వారి యొక్క పేగులకి అలవాటు లేదు కాబట్టి ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ఫెక్షన్స్ వంటివి రావచ్చు. అదే రెగ్యులర్ గా ఇలా దాచుకుని తినే వాళ్ళు తింటే శరీరానికి అలవాటు పడి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలగవు. పోషకాలు మాత్రం తగ్గిపోతాయి చూసుకోండి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…