కల్తీ జరిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన, ఆరోగ్యం పాడవుతుంది. తీసుకునే ఆహార పదార్థాలు, మంచివో కాదు చూసుకోవాలి. కల్తీ జరిగిందా లేదా అనేది తెలుసుకుని, ఆ తర్వాత మాత్రమే వాటిని తీసుకోవాలి. ఈరోజుల్లో చాలా ఆహార పదార్థాలని రకరకాలుగా కల్తీ చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే, ఆరోగ్యానికి తేనె మంచిదని చాలామంది రెగ్యులర్ గా తేనెను తీసుకుంటారు. తేనె, నిమ్మరసాన్ని ఉదయం పరగడుపున తాగుతుంటారు. నిజానికి తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ తోనే పోరాడుతుంది.
తేనె, నిమ్మరసం నీళ్లు కలిపి తాగితే, ఉదర సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు. రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అయితే, సహజమైన తేనె తీసుకుంటే, ఎటువంటి లాభాలని పొందవచ్చు. కానీ, కల్తీ తేనెను తీసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తప్ప ప్రయోజనాలు వుండవు. స్వచ్ఛమైన తేనె అని, ధర ఎక్కువ పెట్టేసి, కల్తీ చేస్తున్నారు. చెరుకు, వరి, మొక్కజొన్న, గోధుమలు, బీట్రూట్ నుండి షుగర్ సిరప్ ని తయారు చేసి, తేనెలో మిక్స్ చేస్తున్నారు.
అడవి తేనె పేరుతో రోడ్డుపై ఎక్కువ రేటు పెట్టి అమ్ముతున్నారు. చాలామంది తేనె అని బెల్లం పాకాన్ని కూడా ఇస్తూ ఉంటారు. కల్తీ దాన్ని తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు కలగవు. ఆరోగ్యానికి హాని కలుగుతుంది. స్వచ్ఛమైన తేనెను ఎలా గుర్తించాలి…? నకిలీ తేనె ని ఎలా తెలుసుకోవాలి అనే విషయానికి వచ్చేస్తే, వాటర్ డిసోల్యూషన్ టెస్ట్ బాగా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ తేనె వేయండి.
ఆ తేనె కనుక సులభంగా కరిగిపోయినట్లయితే, అది కల్తీ తేనె అని అర్థం చేసుకోవాలి. స్వచ్ఛమైన తేనె నీటిలో కరగదు. గ్లాసు అడుగుకు వెళ్ళిపోతుంది. స్వచ్ఛమైన తేనెను గుర్తించడానికి, పేపర్ టవల్ టెస్ట్ కూడా పని చేస్తుంది. పేపర్ టవల్ షీట్ తేనెను పీల్చుకోలేదు. ఒకవేళ కనుక త్వరగా పీల్చుకుంటే, అది నకిలీ తేనె అని గుర్తించాలి. హీట్ టెస్ట్ కూడా బాగా పనిచేస్తుంది. తేనెను వేడి చేయండి. స్వచ్ఛమైన తేనె కారామెలైజ్ అవుతుంది. బంగారం రంగులోకి వస్తుంది. మంచి వాసన కూడా వస్తుంది. తేనె కాలిపోయి, కాలిన వాసన వస్తే అది నకిలీ తేనె అని చెప్పవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…