Eye Sight : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. కంటి చూపు అమాంతం పెరుగుతుంది..!

April 12, 2023 8:00 PM

Eye Sight : ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న జ‌నాభాలో నేడు అధిక శాతం మంది ఎదుర్కొంటున్న ప్ర‌ధాన అనారోగ్య స‌మ‌స్య‌ల్లో నేత్ర సంబంధ‌మైన‌వి కూడా ఎక్కువ‌గానే ఉంటున్నాయి. ఈ రోజుల్లో అప్పుడే పుట్టిన శిశువుల్లో కూడా ఈ స‌మ‌స్య ఎదుర‌వ‌డం స‌ర్వ సాధార‌ణ‌మైపోయింది. ఇక యువ‌త‌, పెద్ద‌ల్లో అధిక శాతం మంది చిన్న వ‌య‌స్సులోనే కంటి అద్దాలు, కాంట‌క్ట్ లెన్స్‌లు ధ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే వారు నేత్ర సంర‌క్ష‌ణ‌పై దృష్టి సారించాల్సి వ‌స్తోంది. అయితే కింద ఇచ్చిన ప‌లు స‌హ‌జ సిద్ధ‌మైన టిప్స్‌ను పాటిస్తే నేత్ర సంబంధ స‌మ‌స్య ఏదైనా సుల‌భంగా దూర‌మ‌వుతుంది. ఆ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగితే దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు వెంట‌నే దూర‌మ‌వుతాయి. క్యారెట్ల‌లో విట‌మిన్ ఎ, బీటా కెరోటిన్ వంటివి పుష్క‌లంగా ఉంటాయి. ఇవి నేత్ర సంబంధ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాయి. చూపు స్ప‌ష్ట‌త‌ను పెంచుతాయి. నేటి త‌రుణంలో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూట‌ర్ల వాడ‌కం ఎక్కువైంది. దీనికి తోడు బ‌య‌ట తిర‌గ‌డం, ప‌ని ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటే ఆ ప్ర‌భావం క‌ళ్ల‌పై కూడా ప‌డుతుంది. రోజూ క‌నీసం 3 గంట‌ల పాటు క‌ళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకుంటే ఈ ఒత్తిడి నుంచి సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. రోజులో కొంత స‌మయం పాటు ఆహ్లాద‌క‌ర‌మైన ప‌చ్చ‌ని ప్ర‌కృతిని చూడండి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్ల‌కు ఎంత‌గానో హాయి క‌లుగుతుంది. ఇది నేత్రాల‌కు పూర్తి స్థాయిలో హాయినిస్తుంది.

Eye Sight improving health tips
Eye Sight

కంటి అద్దాలు, కాంటాక్ట్ లెన్స్‌ల‌ను ఎక్కువ‌గా ధ‌రించే వారు రోజులో కొంత స‌మ‌యం పాటు వాటికి దూరంగా ఉండేందుకు య‌త్నించండి. దీని వ‌ల్ల లెన్స్‌ల ద్వారా క‌ళ్ల‌పై ప‌డే ఒత్తిడి త‌గ్గుతుంది. కంప్యూట‌ర్ల‌పై ఎక్కువ‌గా ప‌నిచేసేవారు అవ‌స‌ర‌మైతేనే వాటిని వాడాలి. లేదంటే దూరంగా ఉండాలి. వీలైనంత వ‌ర‌కు కంప్యూట‌ర్ స్క్రీన్ల నుంచి దూరంగా ఉండేందుకు య‌త్నించాలి. క‌ళ్ల‌ను నిత్యం కొంత సమ‌యం పాటు సున్నితంగా మ‌సాజ్ చేయాలి. ఇలా చేస్తే క‌ళ్ల‌కు విశ్రాంతి క‌లుగుతుంది. రోజూ ఒక అరగంట పాటు గోరు వెచ్చ‌ని త‌డి గుడ్డ‌తో క‌ళ్ల‌ను సున్నితంగా ఒత్తిన‌ట్టు చేయాలి. ఇది క‌ళ్ల‌కు హాయినిస్తుంది. ఇలా ప‌లు చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల కంటి స‌మ‌స్య‌లు పోతాయి. కంటి చూపు అమాంతం పెరుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now