Drinking Alcohol : రోజూ 90 ఎంఎల్‌ మద్యం సేవిస్తే ఏమవుతుంది.. తెలుసుకోకపోతే నష్టపోతారు..!

June 5, 2023 11:51 AM

Drinking Alcohol : మద్యం సేవించడం అనేది నేటి తరుణంలో చాలా మందికి ఫ్యాషన్‌ అయిపోయింది. రోజూ ఏదో ఒక కారణం చెప్పి మద్యం సేవిస్తున్నారు. మద్యం సేవిస్తే మంచిదే కదా అని కూడా కొందరు అంటుంటారు. ఇక కొందరు మనస్సు బాగా లేదనో, ఒత్తిడి ఎక్కువగా ఉందనో, ఇతరత్రా సమస్యలు ఉన్నాయనో చెప్పి రోజూ మద్యం సేవిస్తుంటారు. అయితే వాస్తవానికి మద్యాన్ని ఎప్పుడో ఒకసారి ఒకటి లేదా రెండు పెగ్గులు సేవిస్తే మంచిదే అని వైద్య నిపుణులు చెబుతుంటారు. కానీ దాన్ని రోజూ వ్యసనంగా తీసుకుంటుంటే మాత్రం అది ఆరోగ్యానికి ఎంతో కీడును కలిగిస్తుందని అంటున్నారు. రోజూ మద్యం సేవించడం వల్ల ఎన్ని అనర్థాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది 90 ఎంఎల్‌ అని చెప్పి రోజూ మద్యం సేవిస్తుంటారు. అయితే అంత తక్కువ మోతాదులో అయినా సరే ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు. కానీ రోజూ అయితే మాత్రం దుష్పరిణామాలు సంభవిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ మద్యం సేవించడం వల్ల శరీరంపై ఒత్తిడి పడుతుంది. అది మానసికంగా కూడా ప్రభావం చూపిస్తుంది. మద్యం రోజూ సేవించడం వల్ల మెదడు కణాలు దెబ్బ తింటాయి. దీంతో మానసికంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. విసుగు, కోపం, చికాకు వంటివి వస్తాయి. ఎవరు చెప్పినా వినరు. మద్యానికి బానిసలుగా మారిపోతారు. అందుకోసం ఏం చేసేందుకైనా వెనుకాడరు. కనుక మద్యం రోజూ సేవించడం మానుకోవాలి.

Drinking Alcohol daily can give side effects
Drinking Alcohol

రోజూ మందు తాగడం వల్ల లివర్‌కు ఎంతగానో నష్టం కలుగుతుంది. కిడ్నీలు చెడిపోతాయి. దీంతో ప్రాణాల మీదకు వస్తుంది. అప్పుడు చేసేదేమీ ఉండదు. అలాగే క్యాన్సర్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. డయాబెటిస్‌, గుండె జబ్బులు వస్తాయి. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. గ్యాస్‌, అసిడిటీ సమస్యలు వస్తాయి. ఆహారం సరిగ్గా తినలేరు. తిన్నా వంటబట్టదు. శరీరం అంతా విషతుల్యంగా మారుతుంది. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. దీంతో ప్రాణాల మీదకు వస్తుంది.

రోజూ మద్యం సేవిస్తే కొంత కాలానికి చిన్నపాటి ధ్వనులను కూడా గుర్తించలేరు. వాసనశక్తి తగ్గిపోతుంది. చూపు స్పష్టంగా ఉండదు. శరీరం వణికినట్లు అవుతుంది. ఇన్ని అనర్థాలు పొంచి ఉంటాయి కనుక మద్యాన్ని రోజూ తాగరాదు. ఎప్పుడో ఒకసారి ఒకటి లేదా రెండు పెగ్గులు అయితే ఓకే. కానీ రోజూ సేవిస్తే అనవసరంగా ప్రాణాలను పోగొట్టుకున్నవారు అవుతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment