Fruits : అరటి పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అరటి పండును తీసుకుంటే వెంటనే నీరసం మొత్తం తొలగి పోతుంది. వెంటనే ఎనర్జీ వస్తుంది. అందుకే క్రీడాకారులు అరటిపండుని తీసుకుంటూ ఉంటారు. అయితే రాత్రిపూట మాత్రం అరటి పండును తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రి పూట అరటిపండును తీసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయని అంటున్నారు. రాత్రిపూట అరటిపండు తింటే శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. కనుక రాత్రి పూట అరటి పండుని తీసుకోకుండా ఉండడమే మంచిది.
రాత్రిపూట ఆపిల్ తీసుకుంటే మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. సపోటాని తీసుకుంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రాత్రిళ్ళు సపోటా పండ్లని కూడా తీసుకోకూడదు. ఒకవేళ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. కాబట్టి సపోటా పండ్లని కూడా రాత్రుళ్ళు తీసుకోవద్దు. రాత్రి పూట నారింజ పండ్లు, ద్రాక్ష పండ్లు, బత్తాయి పండ్లు తీసుకోకూడదు. ఈ పండ్లను రాత్రి పూట తింటే కడుపులో గ్యాస్, ఎసిడిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఇలా ఈ పండ్ల వల్ల నష్టం కలుగుతుంది. కాబట్టి రాత్రి పూట వీటిని తీసుకోకండి. మీరే అనవసరంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. రాత్రిపూట వీలైనంత త్వరగా ఆహారం తీసుకోవడం మంచిది. అదే విధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి దూరంగా ఉంటే మంచి నిద్రని పొందవచ్చు.
ఈ రోజుల్లో చాలా మంది ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా భోజనం చేయడం, ఎక్కువసేపు ఫోన్ లోనే ఉండడం వంటివి చేస్తున్నారు. కానీ అజీర్తి సమస్యలు మొదలు నిద్రలేని సమస్యల వరకు ఎన్నో రకాల సమస్యలు కలుగుతాయి. దాంతో మీ ఆరోగ్యం బాగా పాడవుతుంది. కాబట్టి అనవసరంగా ఇటువంటి పొరపాట్లని చేయకండి. ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లోకి పడేసుకోకండి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…