సాధారణంగా సాంబారు కొందరు వివిధ రకాల కూరగాయలతో తయారు చేసుకుంటారు. మరికొందరు మునక్కాడలతో సాంబార్ తయారు చేసుకుంటారు. మీ మునక్కాడల సాంబార్ తినడానికి పిల్లలు సైతం ఎంతో ఇష్ట పడుతుంటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన, రుచికరమైన సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
*కందిపప్పు ఒక కప్పు
*మునక్కాడలు
*ఉల్లిపాయ ఒకటి
*కారం ఒక టేబుల్ స్పూన్
*ఉప్పు తగినంత
*చింతపండు చిన్న ఉల్లిపాయ సైజు
*మెంతులు అర టేబుల్ స్పూన్
*పసుపు చిటికెడు
*ఆవాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్
*నూనె తగినంత
*కరివేపాకు రెమ్మ
*నీళ్లు లీటర్
ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి నీటిని పోసి ఆ నీటిని బాగా మరిగించాలి. నీరు మరుగుతుండగా సమయంలో కందిపప్పును కడిగి అందులో వేసుకోవాలి. కందిపప్పు 70శాతం ఉడికిన తరువాత అందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న మనగ కాయలను వేయాలి. మునగ కాయలను 2 నిముషాలు ఉడికించిన తరువాత చిటికెడు పసుపు ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఒక ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయలను మునగ కాయలను ఉడికించాలి. ఈలోగా మరొక స్టవ్ పై కడాయి ఉంచి మెంతులు దోరగా వేయించుకోవాలి. అలాగే చింతపండును కూడా నానబెట్టుకోవాలి. మునగకాడలు కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులోకి టేబుల్ స్పూన్ కారం వేయాలి. మరో ఐదు నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని ఉడికించిన తరువాత చింతపండు బాగా నలిపి చింత పులుపు వేయాలి. చింతపులుసు వేసిన రెండు నిమిషాలకు తగినంత ఉప్పును వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. చివరిగా దోరగా వేయించుకొని మెంతులను పొడిచేసి మెంతుల పొడి సాంబారులో వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు పెట్టుకుంటే ఎంతో రుచికరమైన మునక్కాడల సాంబార్ తయారైనట్లే.
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…