Jonna Rotte : జొన్నలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది ఇటువంటి వాటిని డైట్ లో తీసుకుంటున్నారు. అయితే చాలామంది జొన్న రొట్టెలు తినడానికి ఇష్టపడతారు. కానీ వాటిని ఎలా చేసుకోవాలో తెలియక ఆగిపోతూ ఉంటారు. ఇలా కనుక మీరు జొన్న రొట్టెలని చపాతీ పీట మీద చేస్తే ఎంతో సులభంగా వస్తాయి. పైగా సాఫ్ట్ గా కూడా ఉంటాయి. జొన్న రొట్టెలు తీసుకోవడం వలన అధిక బరువు సమస్య నుండి బయట పడి మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు.
దీనికోసం ముందు మీరు జొన్నలని తీసుకుని రెండు మూడు సార్లు నీళ్లు పోసి బాగా కడుక్కోవాలి. రెండు రోజులు పాటు జొన్నలని బాగా ఎండబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న ఈ జొన్నలని పిండిలాగా చేసుకోవాలి. ఈ పిండిని రొట్టెల కోసం ఉపయోగించాలి. ఒక కప్పు నీళ్లు స్టవ్ మీద పెట్టి మరిగించి అందులో చిటికెడు ఉప్పు వేయాలి. ఎంత నీళ్లు తీసుకున్నారో అంత జొన్న పిండిని వాటర్ లో వేసేయాలి.
ఈ పిండిని నీళ్ళల్లో వేసాక నెమ్మదిగా పై నుండి కింద దాకా కలుపుకోవాలి. ఆ తరవాత చపాతి పిండిలా బాగా మెత్తగా ఈ పిండిని కలుపుకుని మూత పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని వేడి ఎక్కేంత వరకు ఉంచుకోవాలి. ఈలోగా చపాతిలాగా జొన్న పిండితో వత్తుకోవాలి. పొడి పిండి పెట్టుకుని రొట్టెని వత్తుకుంటూ వెళ్లాలి.
ముందే మీరు చపాతి కర్రతో కాకుండా చేతితో నెమ్మదిగా ప్రెస్ చేస్తూ వత్తుకుంటూ తర్వాత కర్రతో కూడా ప్రెస్ చేస్తూ వత్తుకోవాలి. ఇప్పుడు పెనం మీద రొట్టెను వేసి రెండు చుక్కలు నీళ్లను వేస్తూ చేతితో ప్రెస్ చేసుకోవాలి. ఒక క్లాత్ తో పైన ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా పిండి వచ్చేస్తుంది. అప్పుడు ఎక్స్ట్రా పిండి రోటీకి ఉండదు. రొట్టెని రెండు వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేస్తే కచ్చితంగా ఎవరికైనా నచ్చుతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…