Pithru Dosham : ఎలా అయితే మన తండ్రి, మన తాత చేసిన పుణ్యాన్ని మనం అనుభవిస్తామో.. అలానే వాళ్ళు చేసిన పాపాలను కూడా మనమే అనుభవించాలి. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తిని అనుభవించే అర్హత ఎలా ఉంటుందో, వాళ్ళ పాప పుణ్యాలని కూడా మనమే అనుభవించాలి. పూర్వికులు పాపాలు చేస్తే, ఆ పాపాలు మనకి అంటుకుంటాయి. అదే పుణ్యం చేస్తే ఆ పుణ్య ఫలితం మనకి లభిస్తుంది. చాలామంది అంటూ ఉంటారు తెలిసి కానీ తెలియక నేను ఏ తప్పు చేయలేదు. కానీ ఎందుకు కర్మలని అనుభవిస్తున్నాను అని.. దానికి కారణం పితృ దోషమే.
పితృ దోషం ఉన్నవాళ్లు ఈ జన్మలో ఎటువంటి పాపకర్మలని చేయకపోయినా, సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, దాని వెనుక కారణం పితృ దోషం. వారి పాపాలని కూడా మనమే పంచుకోవాలి. పితృ దోషం వలన దుష్పరిణామాలు చూద్దాం. చిన్నవాళ్లు అకాల మరణం పొందడం, అప్పుల పాలైపోవడం, శరీరంలో ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడం వంటివి. ఇలాంటివి పితృ దోషం వలన కలుగుతాయి. అపనిందల పాలవడం, ప్రమాదాలకు గురవడం, మన కళ్ళముందే చిన్న పిల్లలు వ్యసనాలకి బానిసలు అవ్వడం వంటివి పితృ దోషం వలన కలుగుతాయి.
ఈ పాపాల నుండి గట్టెక్కాలంటే శ్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవాలి. కాశీలో లేదంటే పాపనాశి (అలంపురం జోగులాంబ, గద్వాల జిల్లా) లో మీరు పరిష్కారాన్ని పొందొచ్చు. ఈ శ్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవాలంటే పాలు అన్నంతో చేసిన పాయసం, అన్నము ముద్దపప్పు నెయ్యి, వడ నైవేద్యంగా పెట్టాలి. ఏదైతే నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని ఇంటిపేరు గల వంశస్థులు మాత్రమే తీసుకోవాలి. ఇతరులకి పెట్టకూడదు.
స్వయంగా ఈ వంటలు వండుకుని తీసుకువెళ్లి నైవేద్యం పెట్టాలి. అలా చేయలేకపోయిన వాళ్ళు పూజారి చేత చేయించొచ్చు. అలంపురం వెళ్లి తెల్లవారుజామున తుంగభద్రా నదిలో స్నానం చేసి, అమ్మవారిని, అయ్యవారిని దర్శనం చేసుకున్నాక శ్మశాన నారాయణుడి దగ్గరకి వెళ్ళాలి. పని పూర్తయ్యాక వేరే చోటికి వెళ్లకుండా, ఇంటికి వెళ్లిపోవాలి. ఇలా చేస్తే పితృ దోషం పోతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…