ఆలుగడ్డలతో భిన్న రకాల వంటలను తయారు చేయవచ్చు. చిప్స్, పులుసు, ఫ్రై.. ఇలా భిన్న రకాలుగా ఆలుగడ్డలను వండి తింటారు. అయితే ఎలా చేసినా అవి ఇచ్చే టేస్ట్ మామూలుగా ఉండదు. ఈ క్రమంలోనే కొందరికి ఆలుగడ్డలు అంటే భలే ఇష్టంగా ఉంటుంది. అలాంటి వారికి యూకేలోని ఆ రెస్టారెంట్ బంపర్ ఆఫర్ను అందిస్తోంది.
యూకేలోని ది బొటానిస్ట్ అనే రెస్టారెంట్ నిర్వాహకులు వినూత్నమైన ఆఫర్ ను అందిస్తున్నారు. వారానికి ఒకసారి.. అంటే నెలకు నాలుగు సార్లు వారి రెస్టారెంట్కు చెందిన ఆలు వెరైటీలను టేస్ట్ చేసి రివ్యూలను రాయాలి. సోషల్ మీడియా ప్లాట్ఫాంలలో ఆ రివ్యూలను పోస్ట్ చేయాలి. ఒక్కో రివ్యూ 500 పదాలకు మించరాదు. అలాగే వీడియోల ద్వారా కూడా రివ్యూలు చేయవచ్చు. వాటిని టిక్టాక్ లేదా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి. ఈ విధంగా చేస్తే నెలకు 500 పౌండ్లు.. అంటే దాదాపుగా రూ.50వేలు ఇస్తారు.
నెలకు ఈ విధంగా కేవలం నాలుగు సార్లు.. వారాంతాల్లో పనిచేసి ఏకంగా రూ.50వేలు సంపాదించవచ్చు. ఇక ఉద్యోగానికి గాను సెప్టెంబర్ 19న ప్రత్యేక సెషన్ను నిర్వహిస్తున్నారు. అందులో ఎంపికైన వారికి ఈ ఉద్యోగం ఇస్తారు. అందువల్ల ఆలుగడ్డలు అంటే ఇష్టం ఉన్నవారు.. వాటికి చెందిన వంటకాలను రుచి చూసి రివ్యూలను రాస్తాం అనుకుంటే ఈ జాబ్కు అప్లై చేయవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…