సాధారణంగా వినాయక చవితి రోజు భక్తులు పెద్ద ఎత్తున వినాయకుడి విగ్రహాలను ఇంటికి తెచ్చుకొని పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ విధంగా వినాయకుడికి ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు చేసి స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతారు. స్వామివారికి పూజ చేయడం కోసం భక్తులు తమ స్థోమతకు అనుగుణంగా విగ్రహాలను తెచ్చుకొని పూజిస్తారు. అయితే స్వామి వారికి పూజ చేయడం కోసం ఏ సైజు విగ్రహాన్ని తీసుకురావాలి, ఆ విగ్రహాలకు ఏ విధంగా పూజ చేయాలి ? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా మన ఇంట్లో పూజ గదిలో నిత్య దీపారాధన కోసం వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోవాలి అనుకునేవారు ఇంటి యజమాని బొటనవేలు సైజులో ఉన్న విగ్రహాన్ని మాత్రమే నిత్య పూజకు ఉపయోగించాలి. అదేవిధంగా వినాయక వ్రతాన్ని చేసే సమయంలో వినాయకుడి విగ్రహం అరచేతి పొడవు ఉండాలి. ఈ విధమైన వినాయకుడి విగ్రహాన్ని కేవలం వినాయకుడి వ్రతం చేసే సమయంలో మాత్రమే ఉపయోగించాలి.
వినాయక చవితి పండుగ రోజులలో ఎంత పెద్ద విగ్రహాన్ని తీసుకోస్తే పూజలు కూడా అదే స్థాయిలో నిర్వహించాల్సి ఉంటుంది. పెద్ద విగ్రహాలను తెచ్చి పెట్టడం వల్ల నిత్యం దూప దీపారాధన, అన్నప్రసాదాలు, నైవేద్యాలు సమర్పిస్తూ, భజనలు చేస్తూ, స్వామి వారి కథలను వినిపించాలి. ఇలా పెద్ద విగ్రహాలను తీసుకువస్తే పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహించవలసి ఉంటుంది. ఈ క్రమంలోనే వీలైనంతవరకు వినాయకుడి ప్రతిమలను భారీ స్థాయిలో కాకుండా చిన్న సైజులో ఉన్న వాటిని తీసుకురావడం ఎంతో ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజసిద్ధంగా బంక మట్టితో తయారు చేసిన విగ్రహాలను తీసుకురావడం శ్రేయస్కరం. ఈ విధంగా వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో పూజ చేయటం వల్ల స్వామివారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మనపై ఉంటాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…