కొందరు మనుషుల్లో రోజు రోజుకీ క్రూరత్వం పెరిగిపోతుందని చెప్పేందుకు ఈ సంఘటనే ఉదాహరణ. కేరళలో అత్యంత అమానుషమైన, దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మూగజీవాల పట్ల ఇద్దరు మహిళలు రాక్షసంగా ప్రవర్తించారు. ఓ తల్లి కుక్కతోపాటు నెల రోజుల వయస్సు ఉన్న దాని పిల్లలకు ఇద్దరు మహిళలు నిప్పు పెట్టారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కేరళలోని ఎర్నాకులం జిల్లా అలంగద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మంజలి అనే చిన్న గ్రామంలో నివాసం ఉంటున్న మేరీ, లక్ష్మీ అనే ఇద్దరు మహిళలు ఓ తల్లి కుక్కతోపాటు నెల రోజు వయస్సు ఉన్న దాని 7 పిల్లలకు నిప్పు పెట్టారు. ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే రెండు కుక్క పిల్లలు తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయాయి. తల్లి కుక్క, ఇంకో 5 పిల్లలు బతికాయి. అవి అక్కడి నుంచి పారిపోగా ఓ మహిళ వాటిని గమనించి జంతు సంరక్షణ సిబ్బందికి సమాచారం అందజేసింది. దీంతో వారు ఆ కుక్కలను చేర దీశారు. వాటికి చికిత్స అందిస్తున్నారు.
కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుక్కల పట్ల ఈ విధంగా అత్యంత అమానుషంగా ప్రవర్తించిన ఆ ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…