కొందరు మనుషుల్లో రోజు రోజుకీ క్రూరత్వం పెరిగిపోతుందని చెప్పేందుకు ఈ సంఘటనే ఉదాహరణ. కేరళలో అత్యంత అమానుషమైన, దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మూగజీవాల పట్ల ఇద్దరు మహిళలు రాక్షసంగా ప్రవర్తించారు. ఓ తల్లి కుక్కతోపాటు నెల రోజుల వయస్సు ఉన్న దాని పిల్లలకు ఇద్దరు మహిళలు నిప్పు పెట్టారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కేరళలోని ఎర్నాకులం జిల్లా అలంగద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మంజలి అనే చిన్న గ్రామంలో నివాసం ఉంటున్న మేరీ, లక్ష్మీ అనే ఇద్దరు మహిళలు ఓ తల్లి కుక్కతోపాటు నెల రోజు వయస్సు ఉన్న దాని 7 పిల్లలకు నిప్పు పెట్టారు. ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే రెండు కుక్క పిల్లలు తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయాయి. తల్లి కుక్క, ఇంకో 5 పిల్లలు బతికాయి. అవి అక్కడి నుంచి పారిపోగా ఓ మహిళ వాటిని గమనించి జంతు సంరక్షణ సిబ్బందికి సమాచారం అందజేసింది. దీంతో వారు ఆ కుక్కలను చేర దీశారు. వాటికి చికిత్స అందిస్తున్నారు.
కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుక్కల పట్ల ఈ విధంగా అత్యంత అమానుషంగా ప్రవర్తించిన ఆ ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…