తల్లి ఉందన్న ధైర్యంతో ఆ కొడుకు రాత్రంతా తన తల్లి పక్కనే పడుకున్నాడు. అయితే తన తల్లి మరణించిందనే విషయం తెలియక ఆ కొడుకు రాత్రంతా తల్లి చెంత పడుకొని నిద్రపోయాడు. ఎప్పటిలాగే మరుసటి రోజు ఉదయం ఆ కొడుకు లేచి తన తల్లిని నిద్రలేపాడు. అయితే ఎంత సేపటికీ ఆమె నిద్ర లేకపోవడంతో ఎంతో కంగారుపడిన ఆ బాలుడు తన తల్లి మరణించిందనే విషయం తెలుసుకున్నాడు. ఈ క్రమంలో అతను రోధిస్తున్న ఘటన అందరినీ కలచివేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అశ్వారావుపేట టౌన్ సంతపాకలో నిర్మల (45), కొడుకు కృష్ణ(7)తో కలసి ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న నిర్మల ఎలాంటి వైద్యం చేయించుకోకుండా ఉండటమే కాకుండా, తీవ్రమైన చలి, వర్షానికి ఉండటం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించి పోయింది. దీంతో తన కొడుకు కృష్ణను తన పక్కన పడుకోబెట్టుకుని రాత్రికి రాత్రి నిద్రలోనే మరణించింది.
అయితే తన తల్లి పక్కన పడుకున్నానన్న ధైర్యంతో ఆ బాలుడు తెల్లవారే వరకు తన తల్లి చెంత నిద్ర పోయాడు. ఉదయం కృష్ణ నిద్రలేచి తన తల్లిని నిద్ర లేపగా తన తల్లి లేవకపోవడంతో కంగారుగా చుట్టుపక్కల వారికి ఈ విషయం తెలియజేశాడు. ఈ క్రమంలోనే స్థానికులు ఆమె మరణించిందని వార్త చెప్పడంతో కృష్ణ ఎంతో రోదించాడు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి ఆధార్ కార్డులు తీసుకొని వారి బంధువులకు సమాచారం అందించారు. అయితే తన తల్లి మరణించిందనే వార్త తెలియకుండానే తెల్లవార్లూ తన తల్లి చెంత పడుకున్న కృష్ణను చూసి అక్కడున్న వారందరూ కన్నీరు పెట్టుకున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…