ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కొందరిలో కొన్ని లక్షణాలు తలెత్తుతున్నాయి. కొందరిలో సాధారణమైన తలనొప్పి, జ్వరం రావడం, మరికొందరిలో వళ్ళు నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.ఈ విధమైనటువంటి సమస్యలు రావడం వల్ల చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈక్రమంలోనే వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల జ్వరం ఎందుకు వస్తుంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా మనం టీకా తీసుకున్నప్పుడు మన శరీరంలో రోగనిరోధకశక్తి పునరుత్తేజం అవుతుంది. అందువల్ల ఈ విధమైనటువంటి లక్షణాలు మనలో కనబడతాయి. ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి సహజ వ్యవస్థ… ఈ వ్యవస్థ మన శరీరంలోకి ఏదైనా ప్రవేశించిందని గుర్తించిన వెంటనే ఈ వ్యవస్థ ప్రతిస్పందించడం మొదలుపెడుతుంది. అందుకోసమే మనం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు తెల్ల రక్త కణాలు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని పనిని ప్రారంభించడం మొదలుపెడతాయి. ఆ సమయంలోనే మనం టీకా వేసుకున్న భాగంలో కొద్దిగా నొప్పి, తిమ్మిరిగా ఉండటం, అలసట, జ్వరం వంటి లక్షణాలు కనపడతాయి.
రోగనిరోధక వ్యవస్థలో రెండవ భాగం సముపార్జిత వ్యవస్థ.. మనం టీకా వేసుకోగానే సముపార్జిత వ్యవస్థను చైతన్యపరిచడం వల్ల అసలైన ప్రక్రియ అప్పుడే మొదలయ్యాయి మన శరీరంలో కరోనా వైరస్ కు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఉత్పత్తి కావడం మొదలవుతాయి. ఈ యాంటీబాడీలు మనకు వైరస్ నుంచి పూర్తిగా విముక్తి కలిగిస్తాయి.ఈ విధంగా కరోనా టీకా తీసుకున్నప్పుడు కనిపించే ఈ లక్షణాలు కేవలం కొన్ని గంటలు లేదా రెండు రోజుల వరకు మాత్రమే ఉంటాయని,ఇలాంటి వాటికి భయపడకుండా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి అని అధికారులు తెలియజేస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…