ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కొందరిలో కొన్ని లక్షణాలు తలెత్తుతున్నాయి. కొందరిలో సాధారణమైన తలనొప్పి, జ్వరం రావడం, మరికొందరిలో వళ్ళు నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.ఈ విధమైనటువంటి సమస్యలు రావడం వల్ల చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈక్రమంలోనే వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల జ్వరం ఎందుకు వస్తుంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా మనం టీకా తీసుకున్నప్పుడు మన శరీరంలో రోగనిరోధకశక్తి పునరుత్తేజం అవుతుంది. అందువల్ల ఈ విధమైనటువంటి లక్షణాలు మనలో కనబడతాయి. ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి సహజ వ్యవస్థ… ఈ వ్యవస్థ మన శరీరంలోకి ఏదైనా ప్రవేశించిందని గుర్తించిన వెంటనే ఈ వ్యవస్థ ప్రతిస్పందించడం మొదలుపెడుతుంది. అందుకోసమే మనం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు తెల్ల రక్త కణాలు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని పనిని ప్రారంభించడం మొదలుపెడతాయి. ఆ సమయంలోనే మనం టీకా వేసుకున్న భాగంలో కొద్దిగా నొప్పి, తిమ్మిరిగా ఉండటం, అలసట, జ్వరం వంటి లక్షణాలు కనపడతాయి.
రోగనిరోధక వ్యవస్థలో రెండవ భాగం సముపార్జిత వ్యవస్థ.. మనం టీకా వేసుకోగానే సముపార్జిత వ్యవస్థను చైతన్యపరిచడం వల్ల అసలైన ప్రక్రియ అప్పుడే మొదలయ్యాయి మన శరీరంలో కరోనా వైరస్ కు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఉత్పత్తి కావడం మొదలవుతాయి. ఈ యాంటీబాడీలు మనకు వైరస్ నుంచి పూర్తిగా విముక్తి కలిగిస్తాయి.ఈ విధంగా కరోనా టీకా తీసుకున్నప్పుడు కనిపించే ఈ లక్షణాలు కేవలం కొన్ని గంటలు లేదా రెండు రోజుల వరకు మాత్రమే ఉంటాయని,ఇలాంటి వాటికి భయపడకుండా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి అని అధికారులు తెలియజేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…