అభం శుభం తెలియని చిన్నారి.. అరుదైన వ్యాధితో బాధపడుతోంది.. ఓ వైపు తల్లిదండ్రులు పేద కుటుంబానికి చెందిన వారు.. మరోవైపు ఆదుకునే వారు లేరు.. దీంతో తమ చిన్నారి వైద్య చికిత్సకు సహాయం చేసే వారి కోసం ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. చికిత్సకు ఎంతో ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో వారు ప్రస్తుతం దిక్కు తోచని స్థితిలో ఆపన్న హస్తం అందించే మనస్సు ఉన్న దాతల కోసం ఎదురు చూస్తున్నారు.
అంబర్పేట నియోజకవర్గం పరిధిలోని కాచిగూడ డివిజన్కు చెందిన దోషిలి వినయ్ కుమార్, దోషిలి శిల్పలు దంపతులు. వారిది పేద కుటుంబం. వారికి 4 ఏళ్ల కుమార్తె ఉంది. పేరు సానవి. ఆమెకు పుట్టుకతోనే తీవ్ర అనారోగ్య సమస్య వచ్చింది. వెన్నెముక సమస్య రావడంతో ఆమెకు హాస్పిటల్లో పరీక్షలు చేయించారు. దీంతో ఆమెకు ఎస్ఎమ్ఏ టైప్ 3 వ్యాధి ఉన్నట్లు నిర్దారణ అయింది. ఇది అత్యంత అరుదైన వ్యాధి కాగా చికిత్సకు భారీగా ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు.
ఈ వ్యాధి బారిన పడిన వారికి Zolgensma Spinraza అనే ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది. దాని ఖరీదు దాదాపుగా రూ.16 కోట్లు ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సానవి తల్లిదండ్రులు హతాశులయ్యారు. అంత డబ్బు వెచ్చించే స్థోమత వారికి లేకపోవడంతో వారు తీవ్రంగా బాధపడుతున్నారు. తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీటి పర్యంతమవుతున్నారు.
కాగా తమ చిన్నారిని ఆదుకోవాలని ఆమె తల్లిదండ్రులు అందరినీ వేడుకుంటున్నారు. మనస్సున్న మారాజులు స్పందించి తమ పాపను బతికించాలని కాళ్లా వేళ్లా పడుతున్నారు. ఈ క్రమంలో వారు తమ పాపను బతికించాలని తెలంగాణ ప్రభుత్వానికి సైతం విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే దాతలు ముందుకు వచ్చి తమ కుమార్తె ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు.
Father name: Doshili Vinay Kumar
Mother’s name: Doshili Shilpa
Baby Name: Doshili Saanvi
Account Number: 50100421831334
IFSC CODE: HDFC0000240
PHONE Pay: 9618779839
Google Pay: 9618779839
Paytm: 9618779839
Injection name: Zolgensma Spinraza
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…