ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి సమంత ఎన్నో విభిన్నమైన చిత్రాలలో నటించి ఏకంగా తెలుగింటి కోడలుగా అడుగుపెట్టింది.అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత పెళ్లి తర్వాత కూడా సినిమాల జోరు ఏమాత్రం తగ్గించడం లేదు. ప్రస్తుతం “ది ఫ్యామిలీ మెన్ 2” అనే వెబ్ సిరీస్ లో నటించారు. త్వరలోనే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే ఈ సిరీస్ ప్రమోషన్ లో పాల్గొన్న సమంత పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ప్రతి వ్యక్తి జీవితంలో ముందుగా తన ఇష్టాలు ఏంటో తను తెలుసుకోవాలని, ముందు తనని తాను ప్రేమించుకున్నప్పుడే జీవితం ఎంతో అందంగా ఉంటుందని తెలిపారు. ఇక తన విషయానికి వస్తే నవ్వు, కళ్ళు, శరీర బలం ఈ మూడు లక్షణాలే తన బలం అని సమంత పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఎంతో శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని తెలిపారు.
ఇక నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. తమ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయని అసలు విషయం బయట పెట్టారు. అయితే ఈ విధంగా గొడవలు పడినప్పుడు ముందుగా తనే కాంప్రమైస్ అవుతానని సమంత తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “శాకుంతలం” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…