ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి సమంత ఎన్నో విభిన్నమైన చిత్రాలలో నటించి ఏకంగా తెలుగింటి కోడలుగా అడుగుపెట్టింది.అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత పెళ్లి తర్వాత కూడా సినిమాల జోరు ఏమాత్రం తగ్గించడం లేదు. ప్రస్తుతం “ది ఫ్యామిలీ మెన్ 2” అనే వెబ్ సిరీస్ లో నటించారు. త్వరలోనే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే ఈ సిరీస్ ప్రమోషన్ లో పాల్గొన్న సమంత పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ప్రతి వ్యక్తి జీవితంలో ముందుగా తన ఇష్టాలు ఏంటో తను తెలుసుకోవాలని, ముందు తనని తాను ప్రేమించుకున్నప్పుడే జీవితం ఎంతో అందంగా ఉంటుందని తెలిపారు. ఇక తన విషయానికి వస్తే నవ్వు, కళ్ళు, శరీర బలం ఈ మూడు లక్షణాలే తన బలం అని సమంత పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఎంతో శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని తెలిపారు.
ఇక నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. తమ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయని అసలు విషయం బయట పెట్టారు. అయితే ఈ విధంగా గొడవలు పడినప్పుడు ముందుగా తనే కాంప్రమైస్ అవుతానని సమంత తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “శాకుంతలం” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…