సాధారణంగా మాంసాహారం తింటే ఎన్నో పోషక విలువలు మన శరీరానికి అందుతాయని మనకు తెలుసు. కానీ మాంసాహారం తినే వారికి అదే స్థాయిలో పోషకాలు అందాలంటే ఎంతో ముఖ్యమైన ఆహారాలలో మష్రూమ్స్ ఒకటి . ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ మష్రూమ్స్ తినడానికి ఎంతో మంది ఇష్టపడుతుంటారు. మరి ఎంతో రుచికరమైన స్పైసి… స్పైసి.. మష్రూమ్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇక్కడ తెలుసుకుందాం.
* మష్రూమ్స్500 గ్రాములు
*వెల్లుల్లి ఒకటి
*కొత్తిమీర తగినంత
*ఉప్పు రుచికి సరిపడా
*కారం ఒక టేబుల్ స్పూన్
*పసుపు చిటికెడు
*ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్
*లవంగాలు 3
*గరం మసాల (మీ ఇష్టం)
*పోపు దినుసులు
*ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు
*నూనె తగినంత
ముందుగా మష్రూమ్స్ నీటిలో కడిగి బాగా శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి కొద్దిగా నూనె వేయాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత పోపు దినుసులు వేసి రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఎరుపు వర్ణంలోకి మారిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొన్న మష్రూమ్ వేసి బాగా కలియబెట్టాలి. మష్రూమ్స్ నూనెలో 2నిమిషాలు తర్వాత రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు వేసి మూత పెట్టాలి.
రెండు నిమిషాల తర్వాత మరొక సారి కలియబెట్టాలి. అవసరమైతే ఒక చిన్న గ్లాస్ నీటిని వేసి తక్కువ మంటపై బాగా ఉడికించాలి. ఈలోగా వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు, ధనియాల పొడి, కొత్తిమీర మిశ్రమాన్ని రోటిలో బాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఐదు నిమిషాలు తర్వాత మష్రూమ్స్ బాగా మెత్తగా అయిన తరువాత కారం పొడి వేసి తక్కువ మంట పైనే రెండు నిమిషాలు వేయించాలి. రెండు నిమిషాల తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకొన్న వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించాలి. ఈ విధంగా చేయటం వల్ల పచ్చి వాసన రాకుండా ఉంటుంది.రెండు నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టి స్టౌ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన స్పైసీ మష్రూమ్ ఫ్రై తయారైనట్లే. వేడి వేడిగా ఉండే ఈ మష్రూమ్ ఫ్రై తో చపాతీ లేదా పరోటాతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…