సాధారణంగా మాంసాహారం తింటే ఎన్నో పోషక విలువలు మన శరీరానికి అందుతాయని మనకు తెలుసు. కానీ మాంసాహారం తినే వారికి అదే స్థాయిలో పోషకాలు అందాలంటే ఎంతో ముఖ్యమైన ఆహారాలలో మష్రూమ్స్ ఒకటి . ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ మష్రూమ్స్ తినడానికి ఎంతో మంది ఇష్టపడుతుంటారు. మరి ఎంతో రుచికరమైన స్పైసి… స్పైసి.. మష్రూమ్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇక్కడ తెలుసుకుందాం.
* మష్రూమ్స్500 గ్రాములు
*వెల్లుల్లి ఒకటి
*కొత్తిమీర తగినంత
*ఉప్పు రుచికి సరిపడా
*కారం ఒక టేబుల్ స్పూన్
*పసుపు చిటికెడు
*ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్
*లవంగాలు 3
*గరం మసాల (మీ ఇష్టం)
*పోపు దినుసులు
*ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు
*నూనె తగినంత
ముందుగా మష్రూమ్స్ నీటిలో కడిగి బాగా శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి కొద్దిగా నూనె వేయాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత పోపు దినుసులు వేసి రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఎరుపు వర్ణంలోకి మారిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొన్న మష్రూమ్ వేసి బాగా కలియబెట్టాలి. మష్రూమ్స్ నూనెలో 2నిమిషాలు తర్వాత రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు వేసి మూత పెట్టాలి.
రెండు నిమిషాల తర్వాత మరొక సారి కలియబెట్టాలి. అవసరమైతే ఒక చిన్న గ్లాస్ నీటిని వేసి తక్కువ మంటపై బాగా ఉడికించాలి. ఈలోగా వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు, ధనియాల పొడి, కొత్తిమీర మిశ్రమాన్ని రోటిలో బాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఐదు నిమిషాలు తర్వాత మష్రూమ్స్ బాగా మెత్తగా అయిన తరువాత కారం పొడి వేసి తక్కువ మంట పైనే రెండు నిమిషాలు వేయించాలి. రెండు నిమిషాల తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకొన్న వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించాలి. ఈ విధంగా చేయటం వల్ల పచ్చి వాసన రాకుండా ఉంటుంది.రెండు నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టి స్టౌ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన స్పైసీ మష్రూమ్ ఫ్రై తయారైనట్లే. వేడి వేడిగా ఉండే ఈ మష్రూమ్ ఫ్రై తో చపాతీ లేదా పరోటాతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…