ప్రస్తుతం పెట్రోల్ ధరలు అధికంగా పెరుగుతుండటంతో చాలామంది ఎలక్ట్రానిక్ బైకులు వినియోగించడానికి మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలోనే మార్కెట్లో ఎలక్ట్రానిక్ బైకులకు అధిక డిమాండ్ పెరుగుతోంది. ఈక్రమంలోనే కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు ఒక ఎలక్ట్రానిక్ బైక్ తయారు చేశారు. అయితే ఇది మార్కెట్లో లభించే ఎలక్ట్రానిక్ బైక్ కన్నా ఎంతో ప్రత్యేకమైనది. మరి ఈ బైక్ ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు తయారుచేసిన ఈ ఎలక్ట్రిక్ బైకు ప్రత్యేకత ఏమిటంటే.. ఇది వైర్ లెస్ చార్జింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంది. చూడటానికి సైకిల్ ఆకారంలో ఉన్నటువంటి దీనిని సైకి బైక్ అని పిలుస్తారు. ఈ బండి గంటకి సుమారు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అదేవిధంగా ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. అయితే ప్రతిరోజు సుమారు 5 గంటల పాటు ఈ బండికి చార్జింగ్ చేయాల్సి ఉంటుంది.
కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఈ వైర్లెస్ ఛార్జింగ్ బండి కోసం సెల్ బ్యాలెన్సింగ్ ఫీచర్ ఉంది. అది సరిగ్గా ఛార్జింగ్ అయ్యేలా చేస్తుంది. ఇలాంటి టెక్నాలజీ చాలా తక్కువగా ప్రపంచ దేశాలలో ఉంది. అయితే ఈ బైక్ తయారు చేయడానికి ముందుగానే విద్యార్థులు డూప్లికేట్ ప్రోటోటైప్ తయారుచేశారు. ల్యాబులోని పరికరాలతో చేశారు. అదేవిధంగా ఈ బండిలో BLDC మోటర్ అమర్చారు. ఫలితంగా కంట్రోలర్ ద్వారా మాడ్యూల్స్ని మార్చవచ్చు. ఈ విధంగా కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఈ బైక్ పై యూనివర్సిటీ ప్రెసిడంట్ కోనేరు సత్యనారాయణ ఈ ప్రాజెక్టును స్టార్టప్గా ప్రారంభించేందుకు యూనివర్శిటీ రూ.1,40 లక్షలు ఆ టీమ్కి అందజేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…