ప్రస్తుతం కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్లు మూత పడ్డాయి. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండి , థియేటర్లో విడుదలకు నోచుకోలేక పోయాయి. ఈ క్రమంలోనే పలు సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలయ్యి మంచి వసూళ్లను రాబట్టాయి. అయితే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న “మాస్ట్రో” చిత్రం కూడా ఓటీటీ విడుదలకాబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.
నితిన్, తమన్నా, నభా నటేష్ నటిస్తున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వహించగా శ్రేష్ట మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాను జూన్ 11వ తేదీన థియేటర్లో విడుదల చేయాల్సి ఉంది. అయితే కరోనా కారణం చేత వాయిదా పడిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సమస్థ ఈ సినిమాకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్ ను పరిశీలనలో పెట్టిన మేకర్స్ ఈ సినిమాను ఆగస్టు కల్లా థియేటర్లు ఓపెన్ అయితే ఈ సినిమాను డైరెక్ట్ గా థియేటర్లలో విడుదల చేయడానికి ఇష్ట చూపుతున్నారు. ఒకవేళ ఆగస్టు నెలలో థియేటర్లు తెరచుకోకపోతే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…