గతేడాది కరోనా లాక్ డౌన్ ఉన్నప్పటికీ రిటెయిల్ రంగం ఎంతగానో లాభపడింది. డిమార్ట్, జియోమార్ట్లతోపాటు పలు ఇతర రిటెయిల్, ఈ-కామర్స్ సంస్థలు భారీగా లాభాలను ఆర్జించాయి. అయితే రిటెయిల్ రంగంలో డిమార్ట్ మాతృసంస్థ ఎవెన్యూ సూపర్మార్ట్స్ భారీగా లాభాలను సాధించింది. ఈ క్రమంలోనే అవెన్యూ సూపర్మార్ట్స్ ప్రమోటర్, అధినేత రాధాకిషన్ దమాని ప్రపంచంలోని టాప్ 100 ధనవంతుల్లో ఒకరిగా నిలిచారు.
బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, దమాని ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 97వ స్థానంలో నిలిచారు. ఆయన మొత్తం ఆస్తి విలువ 19.3 బిలియన్ డాలర్లు లేదా రూ.1.43 లక్షల కోట్లు. గత 18 నెలల కాలంలో ఆయన ఆస్తి విలువ 60 శాతం పెరిగింది. మార్చి 1, 2020లో 12 బిలియన్ డాలర్లు ఉన్న ఆయన ఆస్తి విలువ ప్రస్తుతం 19.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఆయన టాప్ 100 ధనికుల జాబితాలో చోటు సంపాదించారు.
వాస్తవానికి అనేక ఈ-కామర్స్ సంస్థలు రిటెయిల్ రంగంలో పోటీగా వ్యాపారం చేస్తున్నప్పటికీ డిమార్ట్ను ఢీకొట్టలేకపోతున్నాయి. వస్తువుల ధరల విషయంలో ఇప్పటికీ డిమార్ట్దే పైచేయిగా ఉంది. వినియోగదారులకు తక్కువ ధరలకే వస్తువులను అందిస్తుందన్న పేరును డిమార్ట్ నిలబెట్టుకుంటోంది. ఆఫ్లైన్ స్టోర్లోనూ ఆన్లైన్లో లేని విధంగా ధరలను అందిస్తోంది. అందుకనే డిమార్ట్ లాభాల బాటలో నడుస్తోంది.
స్టాక్ మార్కెట్ పరంగా కూడా పెట్టుబడిదారులకు ఎవెన్యూ సూపర్మార్ట్స్ కల్పతరువులా మారింది. అందులో వారికి భారీ లాభాలు వస్తున్నాయి. అయితే దమానికి ఎవెన్యూ సూపర్మార్ట్స్లో 74.90 శాతం వాటా ఉండగా, ఆయన పలు ఇతర కంపెనీల్లోనూ వాటాలను కలిగి ఉన్నారు. గత ఏడాదిన్నర కాలంగా ఆయా కంపెనీల వ్యాపారం కూడా బాగానే సాగింది. అందుకనే ఆయన సంపద పెరిగింది. ఆయనకు ఇండియా సిమెంట్స్లో 11.3 శాతం, వీఎస్టీ ఇండస్ట్రీస్లో 26 శాతం, సుందరం ఫైనాన్స్లో 2.4 శాతం వాటాలు ఉన్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…