రోజు రోజుకూ ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఈ అభివృద్ధి చెందుతున్న కాలంలో చాలా మంది వారి ఆలోచనా విధానాలను కూడా మార్చుకున్నారు. ప్రస్తుత కాలంలో ఆడపిల్ల అంటే అదృష్టం, ఆడపిల్ల పుడితే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టిందని చాలామంది భావిస్తున్నారు. అయితే ఇప్పటికీ కొందరు మూర్ఖులు కూడా ఉన్నారు. ఆడపిల్ల, మగపిల్లవాడు అనే లింగ భేదం చూపిస్తూ తమకు కొడుకే కావాలని కొడుకు కోసం ఎంతటి దారుణాలకైనా పాల్పడుతున్నారు.
తాజాగా ఇలాంటి ఘటన ముంబైలో చోటు చేసుకుంది. తనకు కొడుకు కావాలని తన భార్యకు తెలియకుండా ఏకంగా ఎనిమిది సార్లు అబార్షన్ చేయడమే కాకుండా ఆమెకు 1500 వందల ఇంజెక్షన్లను వేయించి ఆమెను ఎన్నో చిత్రహింసలకు గురి చేశాడు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 2007వ సంవత్సరంలో ఆ వ్యక్తి పెళ్లి చేసుకోగా అతని భార్య 2009లో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వృత్తిపరంగా తన భర్త, అత్త న్యాయవాదులు. తన ఆడపడుచు డాక్టర్. ఎంతో గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ఈ విధమైన దారుణానికి పాల్పడ్డారని సదరు మహిళ తన కుటుంబ సభ్యుల పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
2009లో తన కూతురు పుట్టగానే తన భర్త హింసలు ఎక్కువయ్యాయని తన ఆస్తిని కాపాడటానికి వారసుడు కావాలంటూ ఆమెను చిత్రహింసలకు గురిచేసే వాడని తెలిపింది. తనకు తెలియకుండానే విదేశాలకు తీసుకెళ్లి ఆడపిల్ల అని ముందుగా తెలుసుకుని ఎనిమిదిసార్లు అబార్షన్ చేయించాడని, మగ బిడ్డకు జన్మనివ్వడం కోసం 1500 హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజక్షన్లు ఇప్పించారని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి పరీక్షలు భారతదేశంలో నిషేధించడం వల్ల తన భర్త తనను బ్యాంకాక్ తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…