శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎ03ఎస్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్ లో విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెసర్ లభిస్తోంది. 4జీబీ ర్యామ్ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ను ఉపయోగించుకోవచ్చు.
ఈ ఫోన్లో వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, ఇంకో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈఫోన్ లో లభిస్తుంది. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్స్ లో ఈ ఫోన్ను లాంచ్ చేశారు. మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్లను వేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపున ఉంటుంది. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి ఫీచర్లు ఈ ఫోన్లో లభిస్తున్నాయి.
ఈ ఫోన్కు చెందిన 3జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.11,499 ఉండగా, 4జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.12,499గా ఉంది. ఈ ఫోన్ను అన్ని రిటెయిల్ స్టోర్లు, శాంసంగ్ ఆన్లైన్ స్టోర్, ఆన్లైన్ స్టోర్లలో విక్రయిస్తున్నారు. ఫైనాన్స్ సదుపాయంతో కొంటే రూ.1000 క్యాష్ బ్యాక్ ఇస్తారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ముందు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…