ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకవైపు కరోనా దాడి చేయడమే కాకుండా,మరో వైపు బ్లాక్ ఫంగస్ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ వైరస్ బారిన పడి చనిపోతున్నారు. ఇలాంటి సమయాలలో సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వాట్సప్ గ్రూపులలో చికెన్ తినడం వల్ల బ్లాక్ ఫంగస్ వ్యాపిస్తుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమందిని ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ విషయం తెలిసిన వారు చికెన్ తినడానికి ఇష్టపడటం లేదు. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి స్పందించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అపర్ణ ముఖర్జీ మాట్లాడుతూ… వాతావరణంలో ఉండే ఫంగస్ కోళ్లకు, మనుషులకు వ్యాపిస్తుందని, అయితే కోళ్ల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది అనడంలో ఏమాత్రం వాస్తవం లేదని సైంటిస్ట్ డాక్టర్ అపర్ణ తెలిపారు.
బ్లాక్ ఫంగస్ అనేది అంటువ్యాధి కాదని, అలాంటప్పుడు ఇది కోళ్ల నుంచి మనుషులకు ఎలా వ్యాపిస్తుందని ఆమె స్పష్టత ఇచ్చారు. ఇది కేవలం అసత్య ప్రచారాలు మాత్రమేనని ఇలాంటి ప్రచారాలు నమ్మి చికెన్ తినడానికి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ అపర్ణ ముఖర్జీ బ్లాక్ ఫంగస్ గురించి పూర్తి క్లారిటీ ఇచ్చారు. కాబట్టి చికెన్ నిరభ్యంతరంగా తినవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…