దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది బ్యాంకు ఖాతాదారుల అకౌంట్ల నుంచి రూ.330 డెబిట్ అవుతున్నాయి. వారికి ఆ మొత్తం డెబిట్ అయినట్లు మెసేజ్లు, మెయిల్స్ వస్తున్నాయి. అయితే బ్యాంకు ఖాతా నుంచి రూ.330 ఎందుకు డెబిట్ అవుతున్నాయో చాలా మందికి తెలియడం లేదు.
2015వ సంవత్సరం మే 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏడాదికి రూ.330 చెల్లిస్తే రూ.2 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఇన్సూర్ అయిన వ్యక్తి ఏవిధంగా అయినా సరే చనిపోతే అతని నామినీకి రూ.2 లక్షలు వస్తాయి. బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని ఆటో డెబిట్ చేసుకునే విధంగా సదుపాయం కల్పించారు. అందుకనే ఆ మొత్తం బ్యాంకు ఖాతాల నుంచి డెబిట్ అవుతోంది.
అయితే కొందరికి ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. అలాంటి వారికి ఒకటి కన్నా ఎక్కువ ఖాతాల్లో ఆ మొత్తం డెబిట్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వారితోపాటు ఈ పథకం వద్దనుకునేవారు తమ బ్యాంకు బ్రాంచిని సంప్రదించి ఈ పథకం నుంచి తొలగిపోతున్నట్లు లేఖ ఇవ్వాలి. దీంతో డెబిట్ అయిన ఆ మొత్తాన్ని బ్యాంకు వారు రీఫండ్ చేస్తారు.
ప్రతి ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య ఈ పథకానికి ప్రీమియం రూ.330 డెబిట్ అవుతాయి. అదే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో పథకంలో దరఖాస్తు చేసుకుంటే రూ.258, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలలో దరఖాస్తు చేస్తే రూ.170, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో దరఖాస్తు చేస్తే రూ.86 ప్రీమియం చెల్లించాలి. ఏడాది పూర్తి ప్రీమియం రూ.330 చెల్లించాలి.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…