ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ఫేక్ వార్తలకు అడ్డు, అదుపు లేకుండా పోయింది. కొందరు దుండగులు కావాలని పనిగట్టుకుని మరీ ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరొక ఫేక్ వార్త బాగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే..
రూ.12,500 చెల్లిస్తే 30 నిమిషాల్లోగా రూ.4.62 కోట్లు వస్తాయని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ స్కీమ్ను అందిస్తుందని ఓ మెసేజ్ వైరల్ అయింది. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని, తాము అలాంటి స్కీమ్ను ప్రవేశపెట్టలేదని ఆర్బీఐ తెలియజేసింది.
అలాగే ఫ్యాక్ట్ చెక్ కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కూడా ఈ మెసేజ్లో నిజం లేదని, ఆర్బీఐ ఎలాంటి స్కీమ్ను ప్రవేశపెట్టలేదని తెలిపింది. ఈ మేరకు పీఐబీ ట్వీట్ చేసింది. అందువల్ల ఈ మెసేజ్ వచ్చిన వారు స్పందించకూడదని, లేదంటే నష్టపోతారని తెలియజేసింది. ఏమైనా ఇలాంటి మెసేజ్లు వస్తే 155260 నంబర్కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in అనే వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని ఆర్బీఐ తెలియజేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…