ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ఫేక్ వార్తలకు అడ్డు, అదుపు లేకుండా పోయింది. కొందరు దుండగులు కావాలని పనిగట్టుకుని మరీ ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరొక ఫేక్ వార్త బాగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే..
రూ.12,500 చెల్లిస్తే 30 నిమిషాల్లోగా రూ.4.62 కోట్లు వస్తాయని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ స్కీమ్ను అందిస్తుందని ఓ మెసేజ్ వైరల్ అయింది. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని, తాము అలాంటి స్కీమ్ను ప్రవేశపెట్టలేదని ఆర్బీఐ తెలియజేసింది.
అలాగే ఫ్యాక్ట్ చెక్ కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కూడా ఈ మెసేజ్లో నిజం లేదని, ఆర్బీఐ ఎలాంటి స్కీమ్ను ప్రవేశపెట్టలేదని తెలిపింది. ఈ మేరకు పీఐబీ ట్వీట్ చేసింది. అందువల్ల ఈ మెసేజ్ వచ్చిన వారు స్పందించకూడదని, లేదంటే నష్టపోతారని తెలియజేసింది. ఏమైనా ఇలాంటి మెసేజ్లు వస్తే 155260 నంబర్కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in అనే వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని ఆర్బీఐ తెలియజేసింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…