సాధారణంగా మనం భోజనం చేసేటప్పుడు కూరలో ఉప్పు, కారం తక్కువైందని చెప్పడం సర్వసాధారణమే. అయితే ఈ విధంగా చెప్పినప్పుడు ఉప్పు తక్కువైతే మరికొంత వేయడం లేదా ఎక్కువ ఉంటే అందుకు తగిన పరిష్కారాన్ని ఆలోచిస్తాం. మరికొందరు ఒక్కరోజుతో పోయేదే కదా, ఎప్పుడూ ఇలా జరగదు కదా.. అంటూ సరి పెట్టుకుని తింటుంటారు. అయితే కూరలో ఉప్పు తక్కువైందన్న పాపానికి హర్యానాలో భార్య ఏకంగా భర్త తల పగలగొట్టింది. వివరాల్లోకి వెళితే..
హర్యానాలోని హింసార్ జిల్లాలో బార్వాలా పట్టణంలో దినేష్, బిందియా దంపతులు నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి రోజులాగే బిందియా తన భర్త కోసం వంట చేసి పెట్టింది. భోజనం చేసేటప్పుడు భర్త దినేష్ కూరలు సరిగాలేవని, కూరలో ఉప్పు తక్కువైందని చెప్పాడు. తన భర్త తను చేసిన వంటలు నచ్చలేదని చెప్పడం, వాటిల్లో ఉప్పు తగ్గిందని చెప్పడంతో.. వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ విధంగా వారిద్దరి మధ్య మాటల యుద్ధం పెరగడంతో ఇద్దరూ తారాస్థాయిలో గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే బిందియా ఎంతో ఆగ్రహానికి గురై ఇనుప రాడ్ తీసుకొని ఒక్కసారిగా తన భర్త దినేష్ తలపై కొట్టింది. ఈ విషయం గమనించిన పొరుగింటి వ్యక్తి వెంటనే దినేష్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకు వెళ్ళాడు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. తన భార్యతో తనకు ఇలాంటి గొడవలు మామూలేనని, గతంలో ఇలాంటి ఘటనలు చాలా చోటుచేసుకున్నాయని ఈ సందర్భంగా దినేష్ తెలియజేశాడు.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…