దేశవ్యాప్తంగా రోజు రోజుకీ నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గత వారం రోజులుగా రోజుకు 2.50 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతుండగా ఇప్పుడది 3 లక్షలు దాటింది. దీంతో వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే మరింత ప్రమాదం తలెత్తే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో కొందరు ఫేక్ న్యూస్ను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. దీంతో కోవిడ్పై రోజూ రకరకాల ఫేక్ వార్తలు ప్రచారమవుతున్నాయి.
పచ్చి ఉల్లిపాయలను రాక్ సాల్ట్తో కలిపి తింటే కేవలం 15 నిమిషాల్లోనే కరోనా నయం అవుతుందనే ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీన్ని పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదని, కోవిడ్ ప్రమాదకరమైన వైరస్ అని, అంతటి వైరస్ను నాశనం చేసే శక్తి ఉల్లిపాయలకు, రాక్ సాల్ట్కు లేదని వైద్య నిపుణులు తెలిపారు.
అందువల్ల సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తలను నమ్మకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి మెసేజ్లు వస్తే ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. లేదంటే నష్టపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…