దేశవ్యాప్తంగా రోజు రోజుకీ నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గత వారం రోజులుగా రోజుకు 2.50 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతుండగా ఇప్పుడది 3 లక్షలు దాటింది. దీంతో వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే మరింత ప్రమాదం తలెత్తే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో కొందరు ఫేక్ న్యూస్ను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. దీంతో కోవిడ్పై రోజూ రకరకాల ఫేక్ వార్తలు ప్రచారమవుతున్నాయి.
పచ్చి ఉల్లిపాయలను రాక్ సాల్ట్తో కలిపి తింటే కేవలం 15 నిమిషాల్లోనే కరోనా నయం అవుతుందనే ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీన్ని పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదని, కోవిడ్ ప్రమాదకరమైన వైరస్ అని, అంతటి వైరస్ను నాశనం చేసే శక్తి ఉల్లిపాయలకు, రాక్ సాల్ట్కు లేదని వైద్య నిపుణులు తెలిపారు.
అందువల్ల సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తలను నమ్మకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి మెసేజ్లు వస్తే ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. లేదంటే నష్టపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…