Tiger 3 OTT Release Date : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న సల్మాన్ ఖాన్.. ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయాన్ని సొంతం చేసుకోలేదు. మంచి హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. రీసెంట్గా టైగర్ 3అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. మనీష్ శర్మ తెరకెక్కించిన ఈ సినిమాకు ఆరంభంలోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. నార్త్ నుంచి సౌత్ వరకూ ఆడియెన్స్ మంచి స్పందనను అందించలేదు. ఫలితంగా ఈ చిత్రం ఫుల్ రన్లో రూ. 280 కోట్లు వరకు నెట్ వసూళ్లనే మాత్రమే రాబట్ట, ఈ చిత్రం రూ. 30 కోట్లు నష్టాలతోనే నిరాశ పరిచింది. దీంతో సల్మాన్ ఫ్యాన్స్కు మరో షాక్ కూడా తగిలినట్లైంది.
దీపావళి సందర్భంగా నవంబర్ 12న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే డిసెంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రానుంది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొనగా, ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. విడుదలైన 50 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా డీల్ చేశారు. కాని మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ఈ చిత్రాన్ని కేవలం నెల రోజులకే స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
సల్మాన్ ఖాన్ , కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ చిత్రం YRF స్పై యూనివర్స్ లో భాగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైగర్, టైగర్ జిందా హై తర్వాత మూడవ వచ్చిన ఈ చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరిన 17వ చిత్రంగా నిలిచింది. .పాకిస్తాన్ ప్రధానిని హత్య చేసి అధికారం చేజిక్కిచ్చుకుందామనే తీవ్రవాదులపై భారత గూఢాచారి సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కగా ప్రతి నాయకుడిగా బాటీవుడ్ హీరో ఇమ్రాన్ హస్మీ నటించాడు. చిత్రంలో షారుఖ్ ఖాన్ ఒక ప్రత్యేక అతిథి పాత్రలో కనిపిస్తాడు. చివర్లో హ్రితిక్ రోషన్ కూడా కనిపిస్తాడు. సినిమాలో కత్రినా కైఫ్ టవల్ ఫైట్ ఓ రేంజ్ లో ఉండి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…