నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఆరోజు నుంచి ఇప్పటి వరకూ బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు ఆయనకు ప్రత్యేక వైద్య బృందంతో చికిత్సను అందిస్తూనే ఉన్నారు. గత ఏడు రోజులుగా తారకరత్నకు వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్టు సమాచారం. అయితే మెరుగైన వైద్యం కోసం తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ శుక్రవారం వెల్లడించారు. దీంతో నందమూరి తారకరత్న విషయంలో ఏం జరుగుతోందనే చర్చ జరుగుతోంది.
తాజా ఆరోగ్య పరిస్థితిపై స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత డాక్టర్ల సలహా మేరకు మరింత మెరుగైన చికిత్స కోసం అవసరమైతే నందమూరి తారకరత్నను ఎయిర్ అంబులెన్సులో విదేశాలకు ఎయిర్ లిఫ్ట్ చేసే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. తారకరత్నను ఏ క్షణమైనా విదేశాలకు తరలించే అవకాశం ఉందని.. బాలయ్య బాబు కూడా తారకరత్న యోగక్షేమాలు చూసుకునేందుకు ఎయిర్ అంబులెన్సులో వెంట వెళ్తారని టాక్.
గుండెపోటు వచ్చినప్పటి నుండి నందమూరి బాలకృష్ణ తారకరత్న వద్దే ఉంటూ నిత్యం డాక్టర్లను సంప్రదిస్తూ.. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో.. ఆ వదంతులకు చెక్ పెడుతూ నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యుల బృందం ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ స్పష్టత ఇస్తూ వస్తున్నారు. తాజాగా తారకరత్న మెదడుకు శస్త్రచికిత్స జరిగినట్టు తెలుస్తోంది. కాగా గుడెపోటు వచ్చిన టైమ్ లో 45 నిమిషాలు గుండె ఆగిపోవడం వలన తారకరత్న మెదడులో మెదడులో నీరు చేరి మెదడు వాచిందని, వాపు తగ్గిన వెంటనే బ్రెయిన్ రికవరీ అవుతుందని డాక్టర్లు అంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…