శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాలు వస్తుంటాయి. వేరే రోజుల కంటే కూడా శుక్రవారం రోజే సినిమాలను విడుదల చేయడానికి ఇష్టపడుతున్నారు నిర్మాతలు. అయితే అసలు సినిమాలు ఆ రోజునే ఎందుకు విడుదల అవుతాయో తెలుసా ? తెలియకుంటే ఈ వార్త చదవాల్సిందే. ఇలా శుక్రవారాలలో సినిమాలను విడుదల చెయ్యడం ప్రారంభం అయింది మన దేశంలో కాదు. ఈ ట్రెండ్ ని మొదలు పెట్టింది హాలీవుడ్ పరిశ్రమ. ప్రపంచంలో మొదట 15 డిసెంబర్ 1939 శుక్రవారం రోజున విడుదలైన గాన్ విత్ ద విండ్ సినిమాతో ఈ ట్రెండ్ మొదలైంది. అదే కంటిన్యూ అవుతూ వస్తోంది.
ఆ మూవీ అప్పట్లో ఘన విజయం సాధించింది. దాంతో అప్పటి నుంచి శుక్రవారం సినిమాలు విడుదలవడం ఆనవాయితీగా మారింది. ఇక మన దేశంలో అదేవిధంగా శుక్రవారం విడుదలైన మొదటి సినిమా మొఘల్ ఎ అజమ్. ఈ మూవీ కూడా బంపర్ హిట్ అయి ఒక క్లాసికల్గా మిగిలింది. దీన్ని అప్పట్లో బ్లాక్ అండ్ వైట్లో రిలీజ్ చేయగా.. ఈ టెక్నాలజీ యుగంలో ఈ మూవీని కలర్లోనూ మార్చి మళ్లీ రిలీజ్ చేశారు. ఇక ఇందులోని పాటలను ఇప్పటికీ ఎంతో మంది వింటుంటారు. అప్పట్లో మొఘల్ ఎ అజమ్ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో అది సెంటిమెంట్ గా మారిపోయి మన దేశంలో శుక్రవారం సినిమాలు విడుదలవుతూ వస్తున్నాయి.
అంతే కాదు మన దేశంలో శుక్రవారం సినిమా విడుదలను ఎంచుకోవడానికి మరో కారణం ఉంది. అదేటంటే.. శుక్రవారం లక్ష్మీ దేవి రోజు. ఆ రోజు తమ సినిమాలని విడుదల చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్మడం మొదలుపెట్టారు. మరొక కమర్షియల్ కారణం ఏంటంటే.. శుక్రవారం తరువాత వచ్చేది వీకెండ్. శని, ఆది వారాలు. దీంతో సహజంగానే ప్రజలు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు. కొత్త మూవీలు విడుదల అయి ఉంటే వాటిని చూసేందుకు ఆసక్తిని కనబరుస్తారు. దీంతో థియేటర్లు నిండిపోతాయి. మొదటి 3 రోజులు కలెక్షన్స్ బాగా వస్తాయి. దీంతో నష్టాల నుంచి చాలా వరకు గట్టెక్కవచ్చు. అందుకనే ఈ కారణాల చేతనే శుక్రవారం రోజునే సినిమాలను రిలీజ్ చేయడం మొదలు పెట్టారు. అదే ట్రెండ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూ వస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…