టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్లో ఒకరిగా ఉన్న నాగ చైతన్య , సమంత 2017లో వివాహం చేసుకొని నాలుగేళ్ల తర్వాత ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. ఏం మాయ చేశావే’ సినిమాలో కలిసి నటించి.. ఆ ప్రేమకథ సినిమాతోనే ప్రేమలో పడిన జంట నాగ చైతన్య, సమంత. ఆ తర్వాత చాలాకాలం ప్రేమలో ఉన్న తర్వాత వివాహం చేసుకున్నారు.. హిందు, క్రైస్తవ పద్ధతిలో వీళ్లిద్దరి పెళ్లి జరిగింది. అప్పటి నుంచి ఈ ఇద్దరు టాలీవుడ్లో మోస్ట్ లవ్లీ కపుల్స్గా వీళ్లు ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా వీరిద్దరు కలిసి నటించిన ‘మజిలీ’ సినిమా మంచి బ్లాక్బస్టర్ హిట్ కాగా, దీని తర్వాతనే ఎందుకో వీళ్లిద్దరి మధ్య విబేధాలు ఏర్పడి విడిపోయారు.
విడాకుల తర్వాత సమంత నాగ చైతన్య కు సంబంధించిన ఎలాంటి జ్ఞాపకాలు తన దగ్గర ఉండకూడదని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాగచైతన్యతో కలిసిన దిగిన కొన్ని ఫోటోలను కూడా డిలీట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినప్పటి నుండే ఆయనకు సంబంధించిన వస్తువులని ఒక్కొక్కటిగా పంపించింది సమంత. ఈ క్రమంలోనే సమంత పెళ్లి కోసం కట్టుకున్న చీరను కూడా వెనక్కి పంపించినట్లు తెలుస్తోంది. పెళ్లి సమయంలో సమంత కట్టుకున్న పెళ్లి చీర దగ్గుబాటి రామానాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరిది. అంటే స్వయానా నాగచైతన్య అమ్మమ్మ చీర కావడం విశేషం. ఆ చీరను కూడా సమంత పంపించేసిందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి.
సమంత… చైతూకి గుర్తుగా పలు టాటూలు వేయించుకుంది. అవి మాత్రం చెరుపుకోలేకపోయింది. మొదటగా తాను చైతుని కలిసిన ‘ఏం మాయ చేశావే’ సినిమాకు గుర్తుగా వీపుపై ‘వైఎంసీ’ అనే టాటూ వేయుంచుకుంది. అంతేకాక ఆమె కుడి చేయి మీద రెండు యారో మార్కులు ఉంటాయి. అదే టాటూ చైకి కూడా ఉంటుంది. దీంతో పాటు సమంత తన రైట్ రిబ్పై ‘చై’ అనే టాటూ కూడా వేయించుకుంది.ఇవి అలానే ఉన్నట్టు తెలుస్తుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…